Central Government: చనిపోయిన తొమ్మిదిన్నరేళ్లకు UDID కార్డు.. షాక్లో కుటుంబ సభ్యులు
Central Government: ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థల పనితీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనదేశంలో ఏదైనా సరే పని అంత త్వరగా ఏమీ చేయలేమనే విమర్శలు వస్తుంటాయి. పనులను మందకొడిగా జరుతాయని ఏ పని అయినా సులువుగా పరిస్కారం కాదని టాక్ ఉంది. అయితే తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం(70) ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వికలాంగుల గుర్తింపు (యూడీఐడీ) కార్డు వచ్చింది. ఆ కార్డు చూసి గంగరాజం కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఇది ఎలా జరగిందని ప్రశ్నలు వేసుకుంటూ ఆశ్చర్యానికి లోలనయ్యారు. ఇది నిజంగానే గంగరాజం కార్డేనా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివరకు గంగరాజం యూడీఐడీ కార్డు అని తేలడంతో షాక్ తిన్నారు.
Read also: Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా పోరు.. కనిపించకుండా పోయిన నేపాలీలు
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
అసలు కథ ఇదీ..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం కుటుంబం నివాసం ఉంటున్నారు. గంగరాజం వికలాంగుడు. అయితే అతని ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక యూడీఐడీ కార్డు వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే గంగరాజం చనిపోయి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు కావస్తోంది కాబట్టి.. ప్రతి రాష్ట్రం వికలాంగులకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ల ఆధారంగా, యూనివర్సల్ ఐడి, డిసేబిలిటీ సర్టిఫికేట్లను అందించడంలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ యుడిఐడి కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు ద్వారా వికలాంగుల పింఛను, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కానీ గంగరాజం చనిపోయి తొమ్మిదిన్నరేళ్లకే కార్డు ఇంటికి వచ్చింది.
తన తండ్రి 2014లో చనిపోయాడని, అప్పటికి వృద్ధాప్య పింఛను పొందుతున్నాడని కుమారుడు మల్లేశం తెలిపాడు. ఈ కార్డు అప్పుడే వచ్చి ఉంటే వికలాంగుల పింఛన్ వచ్చేదన్నారు. ఈ కార్డు కోసం తన తండ్రి ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నాడో, ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. అది ముందే వచ్చివుంటే ఇప్పుడు గంగరాజం చనిపోయినా పింఛన్ ఇంట్లో ఎవరికో ఒకరికి వచ్చేదని జీవనాధారం పొందేవారని వాపోయారు. ప్రభుత్వ పెద్దల అలసత్వం మరోసారి బట్టబయలైందని మండిపడ్డారు.
CM Revanth Reddy: ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్
తాజావార్తలు
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!