Nagarjuna Sagar: మా విధులు అడ్డుకున్నారు.. ఏపీ లో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరింత వేడెక్కుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్లో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అలాగే స్పందించారు. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో సాగర్ చేరుకున్నారు. ఏపీ పోలీసులు, అధికారులపై తెలంగాణ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఈరోజు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులపై సెక్షన్ 447, 341, రెడ్ విత్ సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సాగర్ డ్యామ్పై తెలంగాణ పోలీసులు తమ విధులను అడ్డుకున్నారని ఏపీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Religious Conversion: ఉత్తర ప్రదేశ్ లో మత మార్పిడి కేసులో 9 మంది అరెస్టు
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
నాగార్జున సాగర్పై దాడులు చేసిన ఏపీ పోలీసులు, జలవనరుల శాఖ అధికారులపై తెలంగాణలో కేసు నమోదైన విషయం తెలిసిందే.. తెలంగాణకు చెందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారని తెలంగాణకు చెందిన అధికారులు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 441, 448, 427 కింద కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు.. మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు శుక్రవారం రాత్రి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. ఒక కమాండెంట్ మరియు 60 మంది సిబ్బంది రాత్రి 9 గంటలకు విజయపురి సౌత్కు వచ్చారు. వీరికి ఏపీఆర్జేసీ కళాశాలలో బస ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం ఇరువైపులా మోహరించిన రెండు రాష్ట్రాల పోలీసులను పంపి కేంద్ర బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తాయి. శుక్రవారం కూడా రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. నీటి ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు, జేసీబీలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డుకు చెందిన అజయ్ కుమార్ గుప్తాతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు తెలంగాణ వైపు ఉన్న విజయ విహార్ అతిథి గృహంలో బస చేసి వివరాలు సేకరించారు. ఏపీ తీరు సరికాదన్న అభిప్రాయానికి వచ్చిన వెంటనే నీటి విడుదల నిలిపివేయాలని లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే..
Liquor Shops: కొత్తగా మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!