Nagarjuna Sagar: మా విధులు అడ్డుకున్నారు.. ఏపీ లో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరింత వేడెక్కుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్లో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అలాగే స్పందించారు. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో సాగర్ చేరుకున్నారు. ఏపీ పోలీసులు, అధికారులపై తెలంగాణ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఈరోజు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులపై సెక్షన్ 447, 341, రెడ్ విత్ సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సాగర్ డ్యామ్పై తెలంగాణ పోలీసులు తమ విధులను అడ్డుకున్నారని ఏపీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Religious Conversion: ఉత్తర ప్రదేశ్ లో మత మార్పిడి కేసులో 9 మంది అరెస్టు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
నాగార్జున సాగర్పై దాడులు చేసిన ఏపీ పోలీసులు, జలవనరుల శాఖ అధికారులపై తెలంగాణలో కేసు నమోదైన విషయం తెలిసిందే.. తెలంగాణకు చెందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారని తెలంగాణకు చెందిన అధికారులు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 441, 448, 427 కింద కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు.. మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు శుక్రవారం రాత్రి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. ఒక కమాండెంట్ మరియు 60 మంది సిబ్బంది రాత్రి 9 గంటలకు విజయపురి సౌత్కు వచ్చారు. వీరికి ఏపీఆర్జేసీ కళాశాలలో బస ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం ఇరువైపులా మోహరించిన రెండు రాష్ట్రాల పోలీసులను పంపి కేంద్ర బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తాయి. శుక్రవారం కూడా రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. నీటి ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు, జేసీబీలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డుకు చెందిన అజయ్ కుమార్ గుప్తాతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు తెలంగాణ వైపు ఉన్న విజయ విహార్ అతిథి గృహంలో బస చేసి వివరాలు సేకరించారు. ఏపీ తీరు సరికాదన్న అభిప్రాయానికి వచ్చిన వెంటనే నీటి విడుదల నిలిపివేయాలని లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే..
Liquor Shops: కొత్తగా మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు
తాజావార్తలు
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!