Nagarjuna Sagar: మా విధులు అడ్డుకున్నారు.. ఏపీ లో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరింత వేడెక్కుతోంది. తాజా వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్లో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు కూడా అలాగే స్పందించారు. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో సాగర్ చేరుకున్నారు. ఏపీ పోలీసులు, అధికారులపై తెలంగాణ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఈరోజు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులపై సెక్షన్ 447, 341, రెడ్ విత్ సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సాగర్ డ్యామ్పై తెలంగాణ పోలీసులు తమ విధులను అడ్డుకున్నారని ఏపీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read also: Religious Conversion: ఉత్తర ప్రదేశ్ లో మత మార్పిడి కేసులో 9 మంది అరెస్టు
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
నాగార్జున సాగర్పై దాడులు చేసిన ఏపీ పోలీసులు, జలవనరుల శాఖ అధికారులపై తెలంగాణలో కేసు నమోదైన విషయం తెలిసిందే.. తెలంగాణకు చెందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారని తెలంగాణకు చెందిన అధికారులు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 441, 448, 427 కింద కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు.. మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు శుక్రవారం రాత్రి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. ఒక కమాండెంట్ మరియు 60 మంది సిబ్బంది రాత్రి 9 గంటలకు విజయపురి సౌత్కు వచ్చారు. వీరికి ఏపీఆర్జేసీ కళాశాలలో బస ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం ఇరువైపులా మోహరించిన రెండు రాష్ట్రాల పోలీసులను పంపి కేంద్ర బలగాలు డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తాయి. శుక్రవారం కూడా రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. నీటి ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు, జేసీబీలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డుకు చెందిన అజయ్ కుమార్ గుప్తాతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు తెలంగాణ వైపు ఉన్న విజయ విహార్ అతిథి గృహంలో బస చేసి వివరాలు సేకరించారు. ఏపీ తీరు సరికాదన్న అభిప్రాయానికి వచ్చిన వెంటనే నీటి విడుదల నిలిపివేయాలని లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే..
Liquor Shops: కొత్తగా మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!