Anantgiri Hills: ఎంజాయ్ చేసుకోమంటే రేసింగ్.. అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantgiri Hills: హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కూడా బడాబాబులు పిల్లలు కార్ రేసింగ్లతో రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ కార్లు, బైక్ లతో సందడి చేస్తున్నారు. మితిమీరిన వేగంతో పరుగెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు బైక్ రేసర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు ప్రకృతి అందాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో బైక్లు, కార్లతో రేసింగ్లు చేస్తూ కలకలం సృష్టించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర రేసింగ్ నిర్వహించి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశాంతంగా ఉన్న అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో విన్యాసాలు దుమ్ము లేపారు. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.
Read also: KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
అనంతగిరి కొండలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్ఐ, సిబ్బంది పహారా కాస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో వారు కూడా గైర్హాజరు కావడంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయారు. బైక్లు, కార్లను విడివిడిగా నడుపుతూ హంగామా చేశారు. పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు రేసింగ్లు ప్రారంభించారు. ఆనందకరమైన అనంతగిరి కొండలలో రేసింగ్లకు అనుమతి లేదు. కానీ కొందరు అటవీ శాఖ సిబ్బంది కొండపైకి అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణం ఇలాంటి రేసింగ్ వల్ల దెబ్బతినకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. వారందరూ తాగి బైక్, కార్లు రేసింగ్ తో ప్రశాంత వాతావరణాన్ని దుమ్మురేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివ వారికి అనంతగిరి కొండలపై అనుమతించకూడదని, ప్రతి ఒక్కరికి తనిఖీలు నిర్వహించి అనుమతించాలని కోరుతున్నారు. ఇలాంటి బడాబాబుల పిల్లల వల్ల అక్కడకు వచ్చే పర్యాటకులు చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందని మండిపడుతున్నారు.
KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!