Anantgiri Hills: ఎంజాయ్ చేసుకోమంటే రేసింగ్.. అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో రచ్చ..!
Anantgiri Hills: హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కూడా బడాబాబులు పిల్లలు కార్ రేసింగ్లతో రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ కార్లు, బైక్ లతో సందడి చేస్తున్నారు. మితిమీరిన వేగంతో పరుగెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు బైక్ రేసర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్కు చెందిన కొందరు యువకులు ప్రకృతి అందాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో బైక్లు, కార్లతో రేసింగ్లు చేస్తూ కలకలం సృష్టించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర రేసింగ్ నిర్వహించి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశాంతంగా ఉన్న అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో విన్యాసాలు దుమ్ము లేపారు. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.
Read also: KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!
Also Read
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
అనంతగిరి కొండలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్ఐ, సిబ్బంది పహారా కాస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో వారు కూడా గైర్హాజరు కావడంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయారు. బైక్లు, కార్లను విడివిడిగా నడుపుతూ హంగామా చేశారు. పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు రేసింగ్లు ప్రారంభించారు. ఆనందకరమైన అనంతగిరి కొండలలో రేసింగ్లకు అనుమతి లేదు. కానీ కొందరు అటవీ శాఖ సిబ్బంది కొండపైకి అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణం ఇలాంటి రేసింగ్ వల్ల దెబ్బతినకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. వారందరూ తాగి బైక్, కార్లు రేసింగ్ తో ప్రశాంత వాతావరణాన్ని దుమ్మురేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివ వారికి అనంతగిరి కొండలపై అనుమతించకూడదని, ప్రతి ఒక్కరికి తనిఖీలు నిర్వహించి అనుమతించాలని కోరుతున్నారు. ఇలాంటి బడాబాబుల పిల్లల వల్ల అక్కడకు వచ్చే పర్యాటకులు చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందని మండిపడుతున్నారు.
KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!