క్లైమాక్స్ చేరిన ప్రచారం.. రంగంలోకి పెద్దలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరిందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు మరో పదిరోజుల సమయం ఉండగా ప్రచారం మాత్రం 72గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. అంటే ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉందనే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా హుజూరాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా సాగుతున్న ప్రచారంలోకి ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఓటర్లంతా ఎవరి వైపు ఆకర్షితులు అవుతారనేది ఆసక్తిని రేపుతోంది.
హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం కావడంతో కాంగ్రెస్ రేసులో ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో చేసిన ఆలస్యం ఆపార్టీకి మైనస్ గా మారింది. చాలా తక్కువ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నియోజకవర్గాన్ని చుట్టిరావడం సమస్యగా మారింది. అంతే కాకుండా ఆయన స్థానికేతరుడు కావడం కూడా కాంగ్రెస్ పార్టీని రేసులో వెనుకబడేసినట్లు కన్పిస్తోంది. దీంతో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యననే స్పష్టమవుతుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో ఓటర్లు ఈ రెండు పార్టీల ప్రచారాన్ని నిషితంగా గమనిస్తున్నారు.
Also Read
ప్రచారంలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ప్రచారం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు తమ శక్తిమేర అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రధానం కేంద్ర వైఫల్యాలపై ఫోకస్ పెడుతోంది. పెట్రోల్, డిజీల్, వంటగ్యాస్ పెరుగుదల, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణపై విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్, దళితబంధు వంటి పథకాలను ఎక్కువగా ప్రచారం చేస్తోంది. ఈటల రాజేందర్ స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందంటూనే బీజేపీ విధానాలను టీఆర్ఎస్ నేతలు తూర్పార పడుతున్నారు.
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తుండటతో బీజేపీ డిఫెన్స్ లో పడుతోంది. ఈనేపథ్యంలోనే కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేలా ప్లాన్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ డజను మందిని రప్పించి టీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇప్పించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈనెల 21 నుంచి కేంద్ర మంత్రులు హుజూరాబాద్ లో ప్రచారం చేసే అవకాశం కన్పిస్తోంది. కేంద్రంపై ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పికొట్టాలని భావిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఉప ఎన్నిక ప్రచారం చూస్తుంటే మాత్రం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు సవాలుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!