TSRTC: ప్రయాణికులకు షాక్..! మరోసారి పెరగనున్న బస్సు చార్జీలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమైంది. ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సామాన్యుల, విధ్యార్థులు ఈభారాన్ని మోపలేని స్థితిలో నెట్టుకొస్తున్నా అయినప్పటికీ టీఎస్ ఆర్టీసీ నష్టం వస్తుందని మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమమయ్యింది. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని, అమలు చేసేందుకు సిద్దంగా వున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, టికెట్ ధరల పెంపుపై పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. డీజిల్ సెస్ రూపంలో రెండుసార్లు పెంచగా, టికెట్ ధరలు ఉండవని భావించారు. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు 30 శాతం టికెట్ ధరలు పెరుగనున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు వర్తిందని టాక్.. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్ ధర 20 శాతం వరకు ఉండనుంది. డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి బస్సులకు 20 శాతం పెంపు ఉండనుంది. దీంతో రోజువారీ నష్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు.
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఇలా పెంచినా సగటున కిలోమీటరుకు టికెట్ పై రూ. 2 నుంచి రూ. 3 వరకు పెరుగుతుందని అధికారులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీ సమక్షంలో సమీక్షించినట్లు తెలుస్తోంది.ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్ కూడా గతంలోనే ప్రకటించారు.చార్జీపై రూ.5 వరకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మార్పులు చేసి, మరోసారి సీఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై ఆమోదం వస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్ టికెట్ ధరలు మరింత పెరుగనున్నాయి.
India Corona Cases : మళ్లీ కరోనా కల్లోలం.. 17 వేలు దాటిన కేసులు..
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!