Builder Murder: పాము కాటుతో భర్త హత్య.. చేయించింది కట్టుకున్న భార్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Builder Murder: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో మృతి చెందాడని భార్య చెప్పడంతో.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిది గుండెపోటు కాదని, భార్యే ప్లాన్ వేసి హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రవీణ్ భార్య సహా ఆమెకు సహకరించిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లిలో ప్రవీణ్, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ప్రవీణ్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భార్య లలిత నిత్యం భర్తతో గొడవ పడుతుండేది. భర్తలో మార్పు రాకపోవడంతో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్ స్థలంలో సెంట్రింగ్ పనులు చేస్తున్న రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేష్ కు లలిత చెప్పింది. ఆమె తన భర్తను చంపితే అతనికి ప్లాట్లు ఇచ్చేందుకు రాజీ కుదుర్చుకున్నారు. హత్యకు అంగీకరించిన సురేష్.. రామగుండుకు చెందిన ఇందారపు సతీష్, మందమర్రికి చెందిన మాసా శ్రీనివాస్, భీమా గణేష్ లతో కలిసి ప్రవీణ్ ను హత్య చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశాడు.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
మందమర్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్ పాము కాటు ప్లాన్ సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో లలిత వారి ఖర్చుల కోసం 34 గ్రాముల బంగారు గొలుసును ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ రాత్రి రామగుండంలో మద్యం సేవించిన నిందితులు.. లలితతో ఫోన్ లో మాట్లాడి బైక్ పై ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో పడుకున్న ప్రవీణ్ ని చూపిస్తూ.. లలిత మరో గదిలోకి వెళ్లి వెయిట్ చేసింది. నిందితులు ప్రవీణ్ ముఖాన్ని దిండుతో కప్పి ఊపిరి ఆడకుండా చేశారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న పాము కాటు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రవీణ్ గుండెపోటుతో చనిపోయాడని లలిత చెప్పిన మాటలు మృతురాలి తల్లి నమ్మలేదు. కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో హత్య పథకం బయటపడడంతో అతడి భార్య లలిత సహా ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Amaravati Assigned Land Case: అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్.. సీఐడీకి సరికొత్త ఆధారాలు..!
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!