BRS : ఈనెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం
- ఈనెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం
- తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం
- ప్రజా ఉద్యమాలపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చ
- పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీకి చెందిన కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేకంగా కృష్ణా-గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించి నిర్మాణం చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జలదోపిడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
Also Read
తెలంగాణ రైతాంగానికి సాగునీటి హక్కులు కాపాడేందుకు మరో ప్రజా ఉద్యమం తప్పదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో చేపట్టే ఉద్యమాల రూపురేఖలపై ఈ విస్తృతస్థాయి సమావేశంలో లోతైన చర్చ జరగనుంది. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించాల్సిన నీటిని 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
45 టీఎంసీలకు అంగీకరించి కేంద్ర ప్రభుత్వానికి తలవంచడం రైతాంగ ప్రయోజనాలకు ఘోరమైన ద్రోహమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పాలమూరు రెండో దశ పనులు ఎలా పూర్తవుతాయో చెప్పాలని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి తెలంగాణకు తీవ్రమైన అన్యాయమని ఆయన ఆరోపించినట్లు సమాచారం.
ఇదే సందర్భంలో కేంద్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాలపై ఒక్కరూ మాట్లాడటం లేదని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ కూడా గండి కొడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేంద్రం చేస్తున్న సాగునీటి అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష ప్రజా పోరాటాలే మార్గమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే పాలమూరు నుంచే ఇప్పటికే నీళ్లు వచ్చేవని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రెండేళ్లు గడిచినా రైతాంగ ప్రయోజనాలపై మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఈ నెల 19న జరగనున్న సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, జల కేటాయింపులపై ఉద్యమానికి శ్రీకారం చుట్టే నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ జలదోపిడిపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
John Cena: రిటైర్మెంట్ మ్యాచ్లో ఓడిపోయిన జాన్సీనా.. ఓడించింది ఇతనే!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!