Tragedy in Marriage: తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే వరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy in marriage: రోహిణి కార్తెలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 6 దాటినా.. వాతావరణం చల్లబడడం లేదు. పగటి పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గత వారం రోజులుగా ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే , జూన్ నెలల్లో 15 రోజుల గరిష్ట ఉష్ణోగ్రత 45.7 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. దీంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. బానుడి భగ భగ వాటా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈక్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయట తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అయితే ఈఎండల వల్ల చాలా మంది మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లారితే పందిట్లో చేసుకోవాల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. దానికి కారణం మండుతున్న ఎండలే.
Read also: Fake constable: పోలీస్ అని నమ్మించింది.. ముగురిని ప్రేమలో ముంచింది
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
కౌటాల మండలం గుడ్ల బోరి గ్రామంలో పెళ్లి కొడుకు వడదెబ్బకు గురయ్యాడు. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య, యశోద దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు గుండ్ల తిరుపతికి ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లికూతురు మంచిర్యాల జిల్లా భీమిని గ్రామం. అయితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. పెళ్లి పనులు మాత్రం తనే మొత్తం చూసుకుంటున్నాడు. దీంతో ఎక్కువగా బయట తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరుపతి సోమవారం వడదెబ్బ తగిలింది. దీంతో తిరుపతికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తిరుపతి తీవ్రంగా నీరసించిపోయాడు. దీంతో తిరుపతి కుటుంబసభ్యులు కంగారు పడి చికిత్సకోసం వెంటనే కాగజ్ నగర్ కు తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా తిరుపతిలో పరిస్థితిలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. దురదృష్టవశాత్తు తిరుపతి మాంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెల్లని బట్టలు కట్టుకుని పచ్చని పందిట్లో పెళ్లికొడుకులా కూర్చోవాల్సిన తిరుపతి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్గా ఉంటూ ఆరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లికొడుకు మృత దేహాన్ని పచ్చని పందిట్లో పెట్టి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Aurangabad: చెప్పులు ఎత్తుకెళ్లాయని కుక్కలకు కు.ని ఆపరేషన్..
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..