Tragedy in Marriage: తెల్లారితే పెళ్లి.. ఇంతలోనే వరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy in marriage: రోహిణి కార్తెలో ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 6 దాటినా.. వాతావరణం చల్లబడడం లేదు. పగటి పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గత వారం రోజులుగా ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే , జూన్ నెలల్లో 15 రోజుల గరిష్ట ఉష్ణోగ్రత 45.7 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. దీంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. బానుడి భగ భగ వాటా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈక్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయట తిరిగే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అయితే ఈఎండల వల్ల చాలా మంది మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తెల్లారితే పందిట్లో చేసుకోవాల్సిన యువకుడు విగతజీవిగా మారాడు. దానికి కారణం మండుతున్న ఎండలే.
Read also: Fake constable: పోలీస్ అని నమ్మించింది.. ముగురిని ప్రేమలో ముంచింది
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
కౌటాల మండలం గుడ్ల బోరి గ్రామంలో పెళ్లి కొడుకు వడదెబ్బకు గురయ్యాడు. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య, యశోద దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు గుండ్ల తిరుపతికి ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లికూతురు మంచిర్యాల జిల్లా భీమిని గ్రామం. అయితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. పెళ్లి పనులు మాత్రం తనే మొత్తం చూసుకుంటున్నాడు. దీంతో ఎక్కువగా బయట తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరుపతి సోమవారం వడదెబ్బ తగిలింది. దీంతో తిరుపతికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తిరుపతి తీవ్రంగా నీరసించిపోయాడు. దీంతో తిరుపతి కుటుంబసభ్యులు కంగారు పడి చికిత్సకోసం వెంటనే కాగజ్ నగర్ కు తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా తిరుపతిలో పరిస్థితిలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. దురదృష్టవశాత్తు తిరుపతి మాంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెల్లని బట్టలు కట్టుకుని పచ్చని పందిట్లో పెళ్లికొడుకులా కూర్చోవాల్సిన తిరుపతి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్గా ఉంటూ ఆరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లికొడుకు మృత దేహాన్ని పచ్చని పందిట్లో పెట్టి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Aurangabad: చెప్పులు ఎత్తుకెళ్లాయని కుక్కలకు కు.ని ఆపరేషన్..
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!