Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
- బోనాల కోసం భారీ ఏర్పాట్లు
- 3,427 ఆలయాలకు రూ.15.05 కోట్లు
- గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు జాతర
- భక్తులకు కట్టుదిట్టమైన భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonalu 2026: తెలంగాణ విశిష్ట సంస్కృతికి, భక్తిభావానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు జరిగే ఈ చారిత్రాత్మక బోనాల జాతరకు పక్కా ప్రణాళికతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
3,427 ఆలయాలకు రూ.15.05 కోట్ల నిధులు విడుదల
నగరంలోని అమ్మవారి ఆలయాలన్నింటినీ దేదీప్యమానంగా అలంకరించేందుకు , ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈ బోనాల ఉత్సవాల నిమిత్తం మొత్తం 3,427 దేవాలయాలకు రూ. 15 కోట్ల 5 లక్షల 41 వేల 150 రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, పోలీసు , ఆరోగ్య శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
గోల్కొండ బోనాలతో ప్రారంభం.. నెల రోజుల పాటు ఉత్సవాల కోలాహలం
చారిత్రాత్మక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో జూలై 16న సమర్పించే తొలి బోనంతో ఈ ఆషాఢ మహోత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే జూలై 20, 21, 22 తేదీల్లో నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ఇందులో భాగంగా జూలై 20న అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, జూలై 21న ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం, జూలై 22న రథోత్సవం జరగనున్నాయి.
లష్కర్ బోనాలు.. పాతబస్తీ జాతరతో ముగింపు
ఆ తర్వాత ఆగస్టు 2న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో లష్కర్ బోనాల సమర్పణ ఘనంగా జరగనుంది. ఆ మరుసటి రోజున అంటే ఆగస్టు 3న భవిష్యవాణి వినిపించే ప్రసిద్ధ ‘రంగం’ కార్యక్రమంతో పాటు అమ్మవారి సాకల ఊరేగింపు నిర్వహిస్తారు. చివరగా ఆగస్టు 9న పాతబస్తీలోని ప్రఖ్యాతి గాంచిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు, హైదరాబాద్ నగరంలోని మిగిలిన ప్రధాన దేవాలయాల్లో ఉత్సవాలు పరాకాష్టకు చేరుకోనున్నాయి. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఈ మహోత్సవాల్లో భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లు, తాగునీరు, పారిశుధ్యం , ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది.
తాజావార్తలు
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!