Ponnam Prabhakar : బోనాలకు జాతరకు భారీ ఏర్పాట్లు
- సికింద్రాబాద్: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రి పొన్నం సమీక్ష
- ఈనెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబరాలు ప్రారంభం
- బోనాల నేపథ్యంలో వివిధ విభాగాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
- పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. జూలై 26నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్ని శాఖల సమన్వయంతో గొప్పగా నిర్వహించాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అశాంతి లేకుండా పండుగ జరగాలని కృషి చేయాలి అని అధికారులను ఆదేశించారు.
Phone Tapping : సిట్ ముందుకు ఈటల రాజేందర్
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
పండుగ సమయంలో విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి.. ఎలక్ట్రిసిటీ వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షించాలి. తోపులాటలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. లష్కర్ బోనాలు హైదరాబాద్కి గర్వకారణమని, మన హైదరాబాద్ వాసులు అతిథులకు ఆతిథ్యం చెప్పడంలో ప్రసిద్ధులు అన్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించాల్సిన బాధ్యత మనదే అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.
గోల్కొండ, ఉజ్జయిని, బల్కంపేట, లాల్ దర్వాజా బోనాలకు విశేష ప్రాధాన్యం ఉందని, నాలుగు వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. బోనం ఎత్తుకునే భక్తులంతా VIP లేనని చెప్పిన మంత్రి, VIP పాసులు బోనాలే లేని రోజుల్లో మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పునరుద్ఘాటించారు. పండుగను మహత్త్వంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని, అమ్మవారి ఆశీర్వాదంతో ఉత్సవాలు సాఫీగా, విజయవంతంగా పూర్తవుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!