South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చిరికలు జారీ చేసింది. కదులుతున్న ట్రైన్ లో ఎక్కిన, దిగిన భారీ జరిమానా విధించడమే కాకుండా.. 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరించారు. కాగా.. రైలు కదులుతున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎక్కుతూ దిగుతుంటారు. దీంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. రైళ్ల కింద పడి కాలు, చేతులు విరగడమే కాకుండా నరకయాతన ఏదుర్కొన వలసిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అయితే ఈ నేపథ్యంలో రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని.. భద్రత విషయంలో రైల్వే శాఖకు సహకరించాలని ఓ ప్రకటనలో కోరింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రైళ్లలో ఎక్కినా, దిగినా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రైలు బయలు దేరిన సమయంలో, స్టేషన్కు చేరుకున్నప్పుడు, రైలు ఎక్కవద్దని, దిగడానికి కూడా ప్రయత్నించవద్దని చెప్పారు.
Read also: RC 16 Movie : గ్రాండ్ గా ప్రారంభమైన RC16 మూవీ.. వైరల్ అవుతున్న వీడియోలు..
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఇక నిషేధిత ప్రాంతం నుంచి రైళ్లలోకి వెళ్లవద్దని చెప్పారు. పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్ వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలన్నారు. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ట్రాక్ల దగ్గర నడిచేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని చెప్పారు. రైల్వే ట్రాక్ల పరిసర ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడంపై నిషేధం ఉందన్నారు. భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 147 ప్రకారం, రైల్వే ట్రాక్పై అతిక్రమించడం చట్టరీత్యా నేరం, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని పేర్కొనడంతో.. రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. కదులుతున్న రైలులో ప్రయాణికులు హడావుడి చేస్తూ ఎక్కుగున్నప్పుడు కిందపడిన వారిని పోలీసులే కాపాడిన దాఖలాలు కూడా వున్నాయని వెల్లడించింది.
ICC – Hasaranga: హసరంగకు ఐసీసీ దెబ్బ మాములుగా లేదుగా..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!