K. Laxman: హైదరాబాద్ లో నేడు, రేపు బీజేపీ సంపర్క్ కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: ఈరోజు, రేపు బీజేపీ సంపర్క్ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి మోడీ మూడో సారి దేశానికి ప్రధానిగా అవసరమని వివరించే కార్యక్రమం చేపట్టామని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముషీరాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సంకల్ప పత్రాన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. అది దేశ భవిష్యత్తు కోసం, 140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సంకల్ప పత్రం అని తెలిపారు. కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో ప్రకటించడం, గ్యారెంటీల పేరుతో ప్రజలను అభ్యపెట్టారని మండిపడ్డారు. 2047 వరకు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే పత్రమే ఈ సంకల్ప పత్రం అన్నారు. పది సంవత్సరాల మోడీ పాలనలో ఐదవ అతి పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్ధాడని అన్నారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నరేంద్ర మోడీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
Read also: Kishan Reddy: తెలంగాణ రైతు పేరుతో కిషన్ రెడ్డి రైతు దీక్ష..
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
పేదల పథకాల్లో దళారీ వ్యవస్థ లేకుండా 34 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశాడన్నారు. మరొక సారి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలిపారు. అవినీతి నల్లధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఉమ్మడి పౌరసత్వం (యూనిఫాం సివిల్ కోడ్) తీసుకురబోతున్నారని అన్నారు. తెలంగాణాలో అత్యధిక మెజారిటీతో బీజేపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ రోజు, రేపు బీజేపీ సంపర్క్ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి మోడీ మూడో సారి దేశానికి ప్రధానిగా అవసరమని వివరించే కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగానే నాతో కలిసి ముషీరాబాద్ అశోక్ నగర్ లో నాయకులు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Read also: Nagarjuna: కొత్త దర్శకులతో నాగార్జున!
మోడీ ప్రజాకర్షణ తట్టుకోలేక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అవినీతి బయట పెట్టకుండా టీవీ సీరియల్ లా కాలయాపన చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మీడియాలో ప్రచారం కోసం కుట్ర పూరిత ప్రచారం చేస్తున్నాడు తప్పా అసలైన దోషులను ఎవరినీ అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రజలు ఈ రెండు పార్టీల వైనాన్ని గమనించి వచ్చే మే 13 ఎన్నికల్లో వారి మోసాన్ని భగ్నం చేయాలన్నారు. నరేంద్ర మోడీ ని ప్రధాని చేసేందుకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే అది మురిగిపోతుందన్నారు. కాంగ్రెస్ ను ఎదురుకునే సామర్థ్యం కేవలం బీజేపీ కె ఉందన్నారు. తెలంగాణ లో భవిష్యత్తు బీజేపీ దే అని గమనించి ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ కి ఓటు వేయమని కోరుతున్నా అన్నారు.
War2 : ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని దింపారా.. ఇది కదా కిక్కు..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!