ఈరోజు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఈ సభకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.
తెలంగాణలో ఐదు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోంది. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.. భారత్ మాతాకీ.. మోడీ మోడీ.. వందేమాతరం అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజకీయ విమర్శలు లేకుండానే ప్రసంగించారు ప్రధాని మోడీ. కేసీఆర్ విమర్శలు, ప్రశ్నలకు జవాబివ్వని మోడీ. టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాని మోడీ. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్న మోడీ.
రైతుల కోసం ఎంతో చేస్తున్నాం. ఎరువుల ఉత్పత్తి పెంచాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. పండించిన పంటకు మంచి గిట్టుబాటు అందిస్తున్నాం.ధాన్యంకి ఎంఎస్ పీ ఇచ్చాం. 2000 వేలు క్వింటాల్ కి అందించాం. ఆధునిక పద్ధతులు పాటించాలి. బీజేపీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం. ఫ్లై ఓవర్లు, రీజినల్ రింగ్ రోడ్డు ఇస్తున్నాం. తెలంగాణకు ఎంతో చేశాం. కనెక్టివిటీ పెరుగుతుంది. 1500 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. పీఎం గ్రామీణ సడక్ యోజన అమలుచేస్తున్నాం. 2019 ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. కొత్త రైల్వే లైన్ లు వస్తున్నాయి. మెగా టెక్స్ టైల్ పార్క్ రైతులకు మేలు జరుగుతుంది. ఉద్యోగాలు అందిస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం అన్నారు మోడీ. మీరంతా ఆశీర్వదించడానికి వచ్చారు. మీ ఉత్సాహం నాకు మరింత శక్తిని ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం మా లక్ష్యం. లాభం చూసుకోకుండా అనేక పథకాలు చేపట్టాం. దేశంలో మహిళలే ఎక్కువ. వారి శక్తిని ఉపయోగించుకుందాం. గ్రామీణ ప్రాంతంలో మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన మన లక్ష్యం. మీ ప్రేమకు నా ధన్యవాదాలు.బీజేపీ విజయ సంకల్ప సభలో సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారు మోడీ. బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ తెలంగాణలో వుంది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. పేదలు, దళితులు, వంచితులు,ఆదివాసీల సంక్షేమం మా బీజేపీ లక్ష్యం. తెలంగాణలో అన్ని వర్గాలు, మధ్యతరగతి వారికోసం ఆలోచిస్తున్నాం. కరోనా కాలంలో ఎంతో శ్రమించాం. మా ప్రభుత్వం తెలంగాణకు మద్దతిచ్చాం. దేశంలో కరోనా వ్యాక్సిన్ తో ఎంతోమందిని కాపాడింది తెలంగాణ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్..మా నినాదం. బడుగు బలహీనవర్గాలకు ఎంతో చేశాం. కేంద్ర పథకాలు వారికి అందుతున్నాయి. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం. తెలంగాణ ప్రజల్లో నమ్మకం పెరిగింది. తెలంగాణ గడ్డ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది.
ఇంతమంది తరలి రావడం సంతోషంగా వుంది. తెలంగాణకు వందనం..అంటూ మోడీ ప్రసంగించారు. రెండురోజులుగా బీజేపీ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. వారికిచ్చిన ఆతిథ్యం అభినందనీయం. బీజేపీ దేశానికి ఆశ, శ్వాస. ఆత్మనిర్భర భారత్ మన నినాదం. తెలంగాణ జనం దేశ వికాసానికి పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. తెలంగాణ కి ఎంతో చరిత్ర ఉంది. యాదాద్రిలో నరసింహస్వామి, భద్రాచల రాముడి ఆశీసులు వున్నాయి. ఆలంపూరులో జోగులాంబ, వరంగలో భద్రకాళి.. రామప్ప మందిరం, కాకతీయ తోరణం.. తెలంగాణ గౌరవాన్ని పెంచుతున్నాయి. ప్రతాప రుద్రుడు, రుద్రమదేవి, కొమురం భీంని ప్రస్తావించారు. భద్రాచలం రామదాసు, పాల్మురికి సోమనాథుడు చిరస్మరణీయులు. తెలంగాణ వికాసానికి మేం నిరంతరం ప్రయాస పడుతున్నాం. 8 ఏళ్లుగా తెలంగాణలో ఏం జరుగుతోంది.
బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తున్న నరేంద్ర మోడీ. భారత్ మాతాకీ.. అంటూ ప్రారంభించిన మోడీ. తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, సోదర సోదరీమణులకు, మాతృముర్తులకు నా నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగించిన మోడీ.
పరేడ్ గ్రౌండ్స్ సభ చూస్తే ఉత్సాహం వస్తోంది. తెలంగాణలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వాతావరణం చూస్తుంటే కేసీఆర్ పతనం ప్రారంభం అయినట్టే అనిపిస్తోంది. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిద్దాం. తెలంగాణ ప్రజలు ఎంతో తెలివైనవారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో నేను వచ్చా. బీజేపీకి భవిష్యత్ ఏంటని పాత్రికేయులు అడిగారు. హైదరాబాద్ జనం బీజేపీని ఆశీర్వదిస్తారన్నాను. అలాగే బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. దుబ్బాకలో రఘునందన్ ని ఎమ్మెల్యేని చేశారు. హుజూరాబాద్ లో ఈటలకు జయం కలిగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కి ఏటియంలా మారింది. బ్రష్టా చార్.. అనాచార్. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయి. కుటుంబంలో వారికి ఉద్యాగాలతో కారు ఫుల్ అయిపోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది. తెలంగాణలో కమల వికాసం ఖాయం అన్నారు జేపీ నడ్డా.
తెలంగాణ అప్పుల ఊబిలో ఉండిపోయింది.తెలంగాణలో న్యాయం జరగాలంటే మోడీ పాలన రావాలి. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీలను బద్దలుకొడతాం. స్వచ్ఛందంగా తరలివచ్చినందుకు ధన్యవాదాలు. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినందుకు రుణపడి వుంటాం. జై శ్రీరాం.
పులి వస్తుంటే గుంటనక్కలు పారిపోతాయా?భారతదేశం కాదు.. ఎక్కడికి వెళ్ళినా స్వాగతిస్తున్నారు. మోడీ గొప్పతనం కేసీఆర్ కి తెలియదు. ఎంతోమంది బలిదానం వల్ల తెలంగాణ వచ్చింది. తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.ఒక పథకం ప్రకారం మోడీని తిడుతున్నారు. మోడీని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మోడీగారు తెలంగాణ గురించి ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. పేద ప్రజలకోసం బీజేపీ పనిచేస్తోంది.
ఇంతమందిని చూస్తుంటే నాకు సంతోషంగా వుంది. టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధ కలిగిస్తాయి. నరేంద్రమోడీ మీద తప్పుడు భాష వుపయోగిస్తున్నారు. ఆయన్ని ఎందుకు తిట్టాలి. పేదలను ఆదుకున్నందుకు తిట్టాలా? ఆకలితో అలమటించకుండా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా తిడుతున్నారు. ఉక్రెయిన్ లో విద్యార్ధులు చిక్కకుంటే వారిని కాపాడినందుకా తిడుతున్నారు. మనం ఇంకా భరిద్దామా. తెలంగాణ తల్లి బంధ విముక్తిని చేయాలి.
అశేష జనసందోహాన్ని చూసి బండి సంజయ్ ని భుజం తట్టి అభినందించిన ప్రధాని నరేంద్రమోడీ. బండి సంజయ్ స్వాగతం పలికారు. నవ్వుతూ మోడీ అభివాదం చేశారు.
పరేడ్ గ్రౌండ్స్ లో మోడీ మంత్రం జపించారు. పరేడ్ గ్రౌండ్స్ లోని విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీకి వినూత్న రీతిలో స్వాగతం పలికారు. జిందా బాద్.. జిందాబాద్.. మోడీజీకి జిందాబాద్ నినాదాలు హోరెత్తించారు. మోడీజీకి స్వాగతం పలికారు. సభకు జనం పోటెత్తారు. మోడీ సభకు అభివాదం చేశారు.
పరేడ్ గ్రౌండ్స్ సభకు స్వాగతం. ఇంతమంది రావడం టీఆర్ఎస్ కు గట్టి జవాబు లాంటిదన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో అవినీతిని ప్రజలు సహించరు. ఎలాంటి వివక్ష లేకుండా పాలన సాగుతోంది. మహారాష్ట్రలో మన ప్రభుత్వం వచ్చింది. త్వరలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది.
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. జేపీ నడ్డా ఆహ్వానంతో బీజేపీకి కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు ఏం జరగలేదు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. టీఆర్ఎస్ సర్కార్ కి చరమగీతం పాడదాం. కొడకుని సీఎం చేయడానికి కేసీఆర్ పనిచేస్తున్నారు. బీజేపీ సర్కార్ రావడం ఖాయం. బీజేపీ గాలి వీస్తోంది. భారత్ మాతాకీ. భారత్ మాతాకీ.. జై. వందేమాతరం.. వందేమాతరం అంటూ ప్రసంగం ముగించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
తెలంగాణలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా సాగాయి. తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. తెలంగాణలో రాబోయే సర్కార్ బీజేపీది. నీళ్ళు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ వచ్చింది. నిధులు వచ్చాయా? నీళ్ళు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయా? 8 ఏళ్ళలో ఏం చేశారు. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? కేటీఆర్ కి ఉద్యగం వచ్చింది. మీకు రాలేదు. మీకు ఉద్యోగం రాలేదని చింత లేదు. టీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో వుంది. భాగ్యనగర్ హైదరాబాద్ సర్దార్ పటేల్ వల్ల దేశంలో భాగం అయింది. హైదరాబాద్ విమోచన దినం ఎందుకు జరపడం లేదు. కేసీఆర్ భయపడుతున్నాడు. హైదరాబాద్ విమోచన దినం జరిపితే ఓవైసీ ఒప్పుకోడు. మోడీ నాయకత్వంలో బీజేపీకి అధికారం ఇవ్వండి. మేం విమోచనదినం జరుపుతాం. సెక్రటేరియట్ కి కేసీఆర్ వెళుతున్నాడా? సచివాలయానికి వెళితే సర్కార్ పోతుందని తాంత్రికుడు చెప్పాడట. అందుకే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదు. సెక్రటేరియట్ కి వెళ్లే అవకాశం బీజేపీ ముఖ్యమంత్రికి దక్కనుంది.
తెలంగాణలో కేంద్రం పథకాలు అమలు కావడం లేదు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది. బీజేపీ బలం ఏంటో చూపిద్దాం. జై హింద్.. జైజై శ్రీరాం అంటూ ప్రసంగం ముగించారు యూపీ సీఎం యోగి.
రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ పరం అవుతుంది. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహం చూపారు. తెలంగాణలో బీజేపీ నేతల ఉత్సాహం చూస్తుంటేనే త్వరలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ యూపీలో వచ్చింది. కార్యకర్తల ఉత్సాహం మాకు ఉత్సాహానిస్తోంది. తెలంగాణలో కమల వికాసం ఖాయం. ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణలో అన్ని వర్గాల వారు మార్పు కోరుకుంటున్నారు. యూపీలో యోగి తరహా పాలన రావాలి. తెలంగాణ వచ్చినా అన్ని వర్గాల ఆశలు నెరవేరలేదు. హైదరాబాద్ సాక్షిగా తెలంగాణలో బీజేపీ విజయ శంఖారావం పూరిస్తుంది. బీజేపీ అందరిలో భరోసా కల్పిస్తుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రాబోతుంది. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు ముగింపురావాలి. రైతులు లాభసాటి వ్యవసాయం రావాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు ఎంపీ డా.కె.లక్ష్మణ్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కేసీఆర్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాయన్నారు బీజేపీ నేత డికె అరుణ.
అయినా ఇతర దేశాలతో పోలిస్తే దేశం పరిస్థితి చాలా ఉన్నతస్థానంలో ఉంది. అంతర్జాతీయ దిగుమతులు కూడా అద్భుతంగా జరిగాయి. ఇవన్నీ మోడీ విజన్ వల్లే..దేశంలోని ఇతర పార్టీల నేతలు తమను తాము రాజులుగా భావిస్తున్నారు.. అందుకే ఇన్నేండ్లు వెనుకబడిపోయింది.కానీ మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మెరుగుపడ్డాయి. రెండ్రోజుల క్రితం నేను వచ్చాను.. వరంగల్ లో బస చేశాను. అక్కడి ప్రజలు, మేధావులు, వ్యాపారులు, నిరుపేదలు, రైతులు, యువకులను కలిశాను. పార్టీకి సంబంధించి పలు మోర్చాల పనితీరును పర్యవేక్షించాను
వరంగల్ లోని ప్రాంతాలను చూసి నా జన్మ ధన్యమైంది.వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, కట్టడాలు అద్భుతం. ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. ఆ ప్రాంత అద్భుతాలను అందరూ చూడాలి. గతంలో లద్ధాఖ్ కు వెళ్లాలంటే చైనా వాళ్లు ఎప్పుడేం చేస్తారోనని బార్డర్ లో భయంభయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సేవ, సమన్వాయం, సమన్వయం, సంవాద్ తో ముందడుగు వేస్తాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల ఎందరో మంది మహిళలు కష్టాల కడలి నుంచి బయటపడ్డారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా అవ్వబోతున్నారని మోడీ ప్రసంగంలో వివరించారు. ఒక దళితుడికి, ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా పలికితే తప్పేంటి? గతంలో అదే పేరుండేది కదా..? ఇదొక్కటే కాదు.. చాలా రాష్ట్రాలకు గతంలో ఒక పేరుంటే.. ఇప్పుడో పేరుతో పిలవడంలేదా?
ప్రధాని మోడీ ముగింపు ప్రసంగంపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వివరించారు. బీజేపీ రెజల్యూషన్ పై మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందించాలని వివరించారు. నిరంకుశ, నియంత్రుత్వ పాలన నుంచి హైదరాబాద్ కు విముక్తి కలిగించిన వ్యక్తి సర్దార్ పటేల్. హైదరాబాద్ సర్దార్ పటేల్ ఇచ్చిన గిఫ్ట్. సర్దార్ పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశాం. మా ప్రభుత్వం ఇప్పటి వరకున్న ప్రధానుల గురించి ఒక మ్యూజియంను ఏర్పాటుచేశాం.
పార్టీలకతీతంగా ఈ పనులన్నీ చేశాం. ప్రజాస్వామ్య పాలనపై మాకున్న డెడికేషన వల్ల ఇది సాధ్యం.ప్రధాని రెండు మాటలు క్లియర్ గా ప్రస్తావించారు. పార్టీ నేతలు ప్రొ పీపుల్.., ప్రొ.. గుడ్ గవర్నెన్స్(ప్రొ పీ టు ప్రొ జీ) గా ఉండాలని సూచించారు. దేశ భవిష్యత్ పై మోడీ విజన్ తో ఉన్నారు. కొవిడ్ సమయంలో దేశ ప్రజలంతా ఎన్నో చాలెంజ్ లు ఎదుర్కొన్నారు. ఆయన విజన్ తో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఆర్థికంగా చితికిపోయింది.
హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. నోవాటెల్ నుంచి మోడీ పరేడ్ గ్రౌండ్ విజయ సంకల్ప సభకు బయల్దేరారు. మోడీ ప్రసంగం ఎలా వుంటుందోనని ఉత్కంఠ. భారీగా చేరుకుంటున్న బీజేపీ శ్రేణులు. ప్రత్యేక విమానంలో మోడీ బేగంపేటకు చేరుకుంటారు.అక్కడినించి రోడ్లుమార్గంలో మోడీ సభకు చేరుకుంటారు. అక్కడికెళ్ళి ప్రసంగిస్తారు.
కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత గురించి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించామని తెలిపారు బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. అధికారంలోకి ఇంకా రాని రాష్ట్రాల్లో ప్రత్యేక ఫోకస్ పెడతామన్నారు. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఎలా ముందుకెళ్లాలనేది చర్చించాం. హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ ప్రాంగంలో రెండురోజుల పాటు సమావేశాలు జరిగాయి.
హైదరాబాద్: ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ముగింపు సందర్భంగా మోడీ ప్రసంగం చేశారు.సర్దార్ పటేల్ చొరవ తోనే హైదరాబాద్ విమోచనం జరిగిందన్నారు ప్రధాని మోడీ. రెండురోజుల పాటు సమావేశాలు నిర్వహించింది బీజేపీ. ప్రస్తుత తెలంగాణ పరిస్థితులను ప్రధాని వివరించారు. తెలంగాణ లక్ష్యం నెరవేరలేదన్నారు.
హైదరాబాద్: బీజేపీ సభ నేపథ్యంలో హైదరాబాద్ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు. బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, హెచ్ఐసీసీ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. ఉప్పల్-మియాపూర్, జేబీఎస్-ఇమ్లీబన్ మెట్రో రైళ్ళు రద్దు చేశారు.
హెచ్ ఐసీసీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మోడీ ప్రసంగం జరుగుతోంది. తెలంగాణ అంశంతోనే ప్రసంగాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ
పరేడ్ గ్రౌండ్స్ కి బీజేపీ నేతలు చేరుకుంటున్నారు. బీజేపీ కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేదికపైకి చేరుకున్నారు. సభ వేదిక పై నాదెండ్ల భాస్కర్ రావు . మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డీ కూడా వేదిక పైకి వచ్చారు. పార్టీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక మీదకు వచ్చారు.
పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న బీజేపీ బహిరంగ సభ కు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బీజేపీ నేతలు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్ళ ద్వారా కార్యకర్తలు వస్తున్నారు. పదిలక్షల వరకూ కార్యకర్తలు రావచ్చంటున్నారు. లక్షమందికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చేరుకున్నవారు కుర్చీల్లో కూర్చున్నారు.
కుటుంబ పాలన సాగుతున్న తెలంగాణలో సుపరిపాలన అందించాలని బీజేపీ భావిస్తోంది. 2023 లో బీజేపీ విజయదుందుభి మోగించాలని బీజేపీ చెబుతోంది. బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ ఏర్పడింది. లక్షలమంది కోసం పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమయింది. సాయంత్రం 4.30 గంటలకు బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి.
ఒకవైపు బీజేపీ సంకల్ప సభ కు రెడీ అవుతోంది బీజేపీ. మరోవైపు హెచ్ ఐసీసీ వద్ద భారీ వర్షం కురుస్తోంది.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మెరుపు ఆందోళన చేస్తామని ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. ముందు జాగ్రత్తగా ఇందిరా పార్క్ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు.
బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు మాట్లాడారు. సీఎం కేసీఆర్ వచ్చి మీటింగ్ లో వున్నా మాకు ఇబ్బంది లేదన్నారు బండి సంజయ్. ఇంటెలిజెన్స్ వారిని పంపి రహస్యంగా చేయాల్సిన పనిలేదు. మాది కుటుంబ పాలన కాదు. మాది పారదర్శక పార్టీ.
దేశంలో ఆర్థిక పరిస్థితి పటిష్టంగా వుంది. మోడీ నాయకత్వంలో ముందుకు సాగుతోంది. భారత కరెన్సీ రూపాయి స్ట్రాంగ్ గా వుంది. మిగతా దేశాలు కరోనా కాలంలో భారత్ సవాళ్ళు ఎదుర్కొంది. కానీ మోడీ విధానాల వల్ల ఇబ్బందులు తగ్గాయి. అమెరికా కూడా ఆర్థిక వ్యవస్థ విషయంలో తడబాటు పడింది. మనం మాత్రం పటిష్టంగా వున్నాం.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ పై ప్రకటన చేశారు డీకె అరుణ. సీఎం ను జైల్ కు పంపిస్తామని బండి చేసిన వ్యాఖ్యల పై పీయూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణ అవినీతి పై అందరికీ తెలుసు.విచారణ లో అవినీతి బయటకు వస్తుందన్నారు పీయూష్ గోయల్.
ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. తఖీలు చేస్తున్నారు బాంబ్, డాగ్ స్క్వాడ్, పడ్ గ్రౌండ్ సభకు విజయ సంకల్ప సభ గా నామకరణం చేసింది బీజేపీ. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పరేడ్ గ్రౌండ్స్ కి చేరుకుంటున్నారు. 10 గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం గత నెలరోజులుగా ఏం చేస్తుందో చూశాం. బీజేపీ కార్యవర్గ సమావేశం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టకుండా చేశారు. నెలరోజుల నుంచి మేం సమావేశానికి ప్రిపేర్ అవుతున్నాం. తెలంగాణలో డిక్టేటర్ పాలన నడుస్తోంది. ఇంతకుముందే ఓవైసీ ఏమన్నారో గుర్తుచేసుకోండి. ఇది ఓవైసీ సర్కారా? లేక కల్వకుంట్ల సర్కారా? దేశంలో 8 ఏళ్ళ నుంచి సెక్రటేరియట్ కి వెళ్లని ఏకైక సీఎం కేసీఆర్. ఫాంహౌస్ లో వుంటే పరిపాలన ఎలా సాగుతుంది. కేబినెట్ మీటింగ్ జరగదు. ఇంట్లో కూర్చుని కిచెన్లో మీటింగ్ జరుగుతుంది. కేసీఆర్ డిప్రెషన్ లో వున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం విఫలం అయింది. తెలంగాణలో మేం అనేక ఉద్యమాలు చేశాం. చేస్తూనే వున్నాం. అమరుల త్యాగాలను పక్కన పెట్టారు. ప్రజాసమస్యల పట్ల మేం స్పందిస్తున్నాం. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నాం. బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కి టెన్షన్ పట్టుకుంది. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పనిచేస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా చేస్తాం. మోడీ సహకారంతో ముందుకెళుతున్నాం అన్నారు బండి సంజయ్.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటలకు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ప్రసంగించారు ఈటల రాజేందర్. 15 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. అంతకుముందే ఈటలను పిలిపించుకొని మాట్లాడారు అమిత్ షా ,నడ్డా. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కెసిఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిపై ప్రసంగం సాగింది. తెలంగాణ ఉద్యమం అంశాలను ప్రస్తావించారు ఈటల రాజేందర్. తెలంగాణలో టిఆర్ఎస్ ను ఓడించే పార్టీగా బిజెపిని నమ్ముతున్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారు. ఈటల ప్రసంగాన్ని అభినందించారు ప్రధాని మోడీ, నడ్డా.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అతిథులకు యాదమ్మ వంటకాలు రుచి చూపించనున్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలను యాదమ్మ బృందం వడ్డించనున్నారు. కార్యవర్గ సమావేశాల్లో భోజన విరామంలో యాదమ్మ వంటకాలు వడ్డించేందుకు సర్వం సిద్దం చేశారు. అతిథులకు అన్ని ఏర్పాట్లుతో డైనింగ్ హాల్ ను సిద్ధం చేశారు.
తెలంగాణ ముఖ్య నేతలతో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అభివృద్ధిని పనితీరును ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని అమిత్ షా పేర్కొన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ రాజకీయ తీర్మానాన్ని అసోం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మ, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై బలపరిచారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్, తెలంగాణలో త్వరలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు కనిపించడంతో వాళ్లను పట్టుకుని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి బయటకు పంపివేశారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడానికి కర్నూలు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేకరైలు కాసేపటి క్రితం సికింద్రాబాద్కు చేరుకుంది. దీంతో ఏపీ బీజేపీ శ్రేణులు పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాతే లోపలకు అనుమతిస్తామని భద్రతా పోలీసులు స్పష్టం చేశారు.
రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. అమిత్ షా రాజకీయ తీర్మానంపై కాసేపట్లో అసోం సీఎం ప్రకటన చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్న బీజేపీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాల రుచి అందనుంది. ఈ మేరకు వంటలను బండి సంజయ్ పరిశీలించారు. ఇందుకు సంబంధించి వంటల నిర్వాహకురాలు యాదమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీని పట్టుకుని సేల్స్ మ్యాన్ అంటూ సంబోధించడం కరెక్ట్ కాదన్నారు. ప్రధాని మోదీ సేల్స్ మ్యాన్ అయితే కోకాపేట భూములను అమ్మిన కేసీఆర్ను ఏమనాలి అంటూ బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. అవును మోడీ సేల్స్ మ్యానే అని.. ప్రజలను ఆదుకోవడంలో, వ్యాక్సిన్ అందించడంలో ఆయన సేల్స్ మ్యాన్గా వ్యవహరించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఆదివారం హైదరాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా కీలకంగా ప్రసంగాలు చేయనున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభ అనంతరం ప్రధాని మోదీ ఈ రాత్రికి రాజ్భవన్లో బసచేయనున్నారు. ఈ మేరకు రాజ్భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా రీత్యా మెట్రో సేవలు బంద్ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అబద్ధమని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. 3 కారిడార్లలో రైళ్లు యథాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.
సీఎం యోగి.. నేడు ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు.