ఎమ్మెల్యే మైనంపల్లి పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నాడు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆహారహం వ్యక్తం చేసాడు. మైనంపల్లి నీకు సిగ్గు లేదు. బీజేపీ లో చేరేందుకు ప్రయత్నించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నీ సంగతి తెలిసే బీజేపీ చేర్చుకోలేదు అన్నారు. ఇప్పుడు నీవు అటు టీఆర్ఎస్ కి, ఇటు బీజేపీకి కాకుండా పోయావు. నీ మీద ఎఫ్ఐఆర్ అయిందంటే అర్థం చేసుకో.. సీఎం ఆదేశాలతోనే నీ మీద కేసు. నీ చెవుల్లో నుండి రక్తం కారాలి. టీఆర్ఎస్ నిన్ను లాగి బయటకు పంపుతుంది. నువ్వు A అంటే మేము A to Z అంటాము అని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే మైనంపల్లిపై బీజేపీ నేతలు అందరూ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.