Medaram Jatara : సమ్మక్క-సారక్క సన్నిధిలో బీజేపీ నేతలు..
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. సమ్మక్క-సారక్కలు గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి కన్నుల పండువగా దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీస్ శాఖ 9 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
అయితే సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు మేడారంకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా వారి మొక్కులను తీర్చుకున్నారు. తెలంగాణాకే తలమానికమైన సమ్మక్క-సారక్క జాతర చరిత్రలో మిగిలిపోతుందంటూ వారు వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
Sanjay Manjrekar: “టీ20తో డబ్బు సంపాదించు.. గౌరవం కావాలంటే టెక్నిక్ మార్చు”.. వైభవ్కు మంజ్రేకర్ సలహా
-
NBKxKoratalaSiva : బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్.. ‘లయన్ కా హుకుమ్’
-
Vijay TVK Government: టీవీకే విజయ్కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
-
Theaters: తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు..
-
Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!