కేసీఆర్ను గద్దె దించేందుకు ఉద్యమంలా పనిచేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం అప్పుడు ఉద్యమించాం… ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించేందుకు కార్యకర్తలు ఉద్యమంలా పనిచేయాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి చమరగీతం పడాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి, బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషిచేయాలన్నారు.. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర సంపదను దోచుకొని రాష్ట్రాన్ని చిరిగిన విస్తారాకుల తయారు చేశాయని మండిపడ్డ ఆమె… గాడి తప్పిన తెలంగాణని గాడిలో పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ ప్రజల మేలుకోసం కాకుండా అధికార కాంక్ష కోసమే పనిచేస్తున్నారని ఆరోపించిన విజయశాంతి.. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.. బీజేపీ అధికారంలోకి వస్తే సంజీవనిలా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!