హుజురాబాద్ చిన్న ఎన్నిక అయితే.. రూ.వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారు?: రాములమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు.
Read Also: శుక్రవారం ధర్నాలు.. కేసీఆర్ పిలుపు
Also Read
హుజురాబాద్ చిన్న ఎన్నిక అయితే అక్కడ రూ.వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని కేసీఆర్ను విజయశాంతి నిలదీశారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని పేర్కొన్నారు. రైతులపై కేసీఆర్కు ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్లినప్పుడు రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. హిందూ ద్వేషి అయిన ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న కేసీఆర్.. బీజేపీని మాత్రం గొడవలు పెట్టే పార్టీ అని చెప్పడం నిజామీ రజాకార్లకు సలాం చేసే స్వభావాన్ని బహిర్గతం చేస్తోందని విజయశాంతి విమర్శలు చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!