Tarun Chug: కేసీఆర్కు బైబై చెప్పే టైం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ నీకు బైబై చెప్పే టైం వచ్చిందని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యానికి శత్రువు కుటుంబ రాజకీయాలు, కేసీఆర్ సర్కార్ జంతర్ మంతర్ సర్కార్ అంటూ సెటైర్లు వేశారు. రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని మండిపడ్డ ఆయన.. కేసీఆర్ సర్కార్ కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు.. అబద్దపు హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చలేదు.. కానీ, అంబేద్కర్ని అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు.. ఈ రోజు నుండి నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. ఇక, 529 రోజులే నీ పాలన అంటూ జోస్యం చెప్పారు.
Read Also: Bheemla Nayak: హిందీలో రీమేక్.. హీరో ఎవరో తెలుసా?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
సాలు దొర.. సెలవు దొర.. అంటూ వెబ్ డిజిటల్ బోర్డ్ ని ప్రతి చోటా పెడతామన్నారు తరుణ్ చుగ్.. ఇక, బీజేపీ కార్యవర్గ సమావేశాలపై స్పందించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులు హైదరాబాద్లో ఉంటున్నారు… మోడీ ప్రధాని అయ్యాక ఎప్పుడు కూడా కార్యవర్గ సమావేశాలకు ఇంత సమయం ఇవ్వలేదని తెలిపారు. ఇక, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా ఈనెల 30వ తేదీనే హైదరాబాద్ రాబోతున్నారు. రానున్నారు. మరోవైపు, జులై 3న పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.. భారీగా జనసమీకరణ చేయడంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది.
- Tags
- bjp
- cm kcr
- tarun chugh
- telangana
- TRS
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!