Tarun Chug: కేసీఆర్కు బైబై చెప్పే టైం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ నీకు బైబై చెప్పే టైం వచ్చిందని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యానికి శత్రువు కుటుంబ రాజకీయాలు, కేసీఆర్ సర్కార్ జంతర్ మంతర్ సర్కార్ అంటూ సెటైర్లు వేశారు. రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని మండిపడ్డ ఆయన.. కేసీఆర్ సర్కార్ కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు.. అబద్దపు హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చలేదు.. కానీ, అంబేద్కర్ని అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు.. ఈ రోజు నుండి నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. ఇక, 529 రోజులే నీ పాలన అంటూ జోస్యం చెప్పారు.
Read Also: Bheemla Nayak: హిందీలో రీమేక్.. హీరో ఎవరో తెలుసా?
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
సాలు దొర.. సెలవు దొర.. అంటూ వెబ్ డిజిటల్ బోర్డ్ ని ప్రతి చోటా పెడతామన్నారు తరుణ్ చుగ్.. ఇక, బీజేపీ కార్యవర్గ సమావేశాలపై స్పందించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులు హైదరాబాద్లో ఉంటున్నారు… మోడీ ప్రధాని అయ్యాక ఎప్పుడు కూడా కార్యవర్గ సమావేశాలకు ఇంత సమయం ఇవ్వలేదని తెలిపారు. ఇక, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా ఈనెల 30వ తేదీనే హైదరాబాద్ రాబోతున్నారు. రానున్నారు. మరోవైపు, జులై 3న పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.. భారీగా జనసమీకరణ చేయడంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది.
- Tags
- bjp
- cm kcr
- tarun chugh
- telangana
- TRS
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..