Revuri Prakash Reddy: రోడ్లపై నాట్లు వేసి నిరసన.. బాగుచేస్తారా? లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం ప్రతి జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. తాజాగా నర్సంపేటలో బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి తనదైన రీతిలో టీఆర్ఎస్ పాలనను ఎండగడుతున్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల ఇబ్బందులు టీఆర్ఎస్ నేతలకు పట్టవని గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందో నర్సంపేటలోని రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Kishan Reddy: బయోమెడికల్ పరిశోధనకు కేరాఫ్ అడ్రస్ NARFBR
Also Read
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్సంపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, కుమ్మరికుంట, పార్కు, సర్వాపురం బైపాస్ రోడ్డు ప్రాంతాలలో నేతలతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల దుస్థితిని చూసి ఆయన బాగా చలించి పోయారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేసి. స్థానిక ఎమ్మెల్యే పనితీరును, ప్రభుత్వ పాలనను ఎండగడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఇబ్బందులు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విఫలం చెందారన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని ప్రకాష్ రెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని కాలనీలు మారుమూల గ్రామాల కంటే అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వర్షం పడితే చాలు రోడ్లపై ప్రజలు నడిచే పరిస్థితి లేదన్నారు. సర్వాపురంలో ఇటీవల రోడ్డపై నడుస్తూ మండల సారమ్మ కాలు విరిగిందని కనీసం వైద్య సౌకర్యం కూడా అందించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Sun In Middle Age: నడి వయస్సుకు సూరీడు. వెలుగునిచ్చే వాడే భూమిని కబళించబోతున్నాడా?
తాజావార్తలు
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!