Revuri Prakash Reddy: రోడ్లపై నాట్లు వేసి నిరసన.. బాగుచేస్తారా? లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం ప్రతి జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. తాజాగా నర్సంపేటలో బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి తనదైన రీతిలో టీఆర్ఎస్ పాలనను ఎండగడుతున్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల ఇబ్బందులు టీఆర్ఎస్ నేతలకు పట్టవని గత ఎనిమిది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందో నర్సంపేటలోని రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Kishan Reddy: బయోమెడికల్ పరిశోధనకు కేరాఫ్ అడ్రస్ NARFBR
Also Read
ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి నర్సంపేట పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, కుమ్మరికుంట, పార్కు, సర్వాపురం బైపాస్ రోడ్డు ప్రాంతాలలో నేతలతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల దుస్థితిని చూసి ఆయన బాగా చలించి పోయారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేసి. స్థానిక ఎమ్మెల్యే పనితీరును, ప్రభుత్వ పాలనను ఎండగడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఇబ్బందులు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విఫలం చెందారన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన నర్సంపేట మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని ప్రకాష్ రెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని కాలనీలు మారుమూల గ్రామాల కంటే అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వర్షం పడితే చాలు రోడ్లపై ప్రజలు నడిచే పరిస్థితి లేదన్నారు. సర్వాపురంలో ఇటీవల రోడ్డపై నడుస్తూ మండల సారమ్మ కాలు విరిగిందని కనీసం వైద్య సౌకర్యం కూడా అందించలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Sun In Middle Age: నడి వయస్సుకు సూరీడు. వెలుగునిచ్చే వాడే భూమిని కబళించబోతున్నాడా?
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..