Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఉపయోగం లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నారు BRS సర్కార్ పై ఏమి చర్యలు తీసుకున్నారు? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోలేదని అంటే మోడీ అసమర్థుడు అనే కదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ లు ఒప్పందములో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని భట్టి విక్రమార్క అన్నారు. సంజయ్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వరంగల్లో జరిగిన బీజేపీ సమావేశంలో డీల్పై చర్చించిన తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని నియమించారని అన్నారు. రాహుల్ తమ నాయకుడని.. ఆయన్ని ఏ హోదాలోవస్తారని ప్రశ్నించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్లకు పడగలెత్తిన తెలంగాణకు న్యాయం చేయలేకపోయారన్నారని తెలిపారు.
Read also: Bandi Sanjay: వరంగల్లో బీజేపీ సభ.. ‘నా మోడీ’ అంటూ బండి ఎమోషనల్ స్పీచ్..
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ప్రజల సంక్షేమానికి అడ్డుగా ఉన్న వారిని తొలగించాలన్నారు. పెట్టుబడిదారీ బీజేపీ, భూస్వామ్య బీఆర్ఎస్లను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని భావిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏది దక్కుతుందో అది పాలకులకే చెందుతుందని ప్రజలు గుర్తించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, సిటీ సెంటర్లోని వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పంజాగుట్ట సర్కిల్ లోని వైయస్సార్ విగ్రహాం వద్ద జరిగే జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎల్పీ కార్యాలయంలో జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు.
Nadendla Manohar : ఈ ప్రభుత్వానికి స్పందించే గుణం లేదు
తాజావార్తలు
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!