Bhatti Vikramarka: కాంగ్రెస్ అంటేనే కరెంట్.. అర్ధం చేసుకో పిచ్చోడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: కాంగ్రెస్ అంటేనే కరెంట్.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంపదను పేదలరు పంచేందుకే ఆరు గ్యారెంటీల ప్రకటన అన్నారు. పదేళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అన్నారు. రైతులకు మేమ చాలా మేళు చేశాం అన్నారు. రైతులకు అందే ఎన్నో సబ్సిడీ పథకాలను కేసీఆర్ రద్దు చేశారని అన్నారు. రైతులను.. కౌలు రైతులను.. రైతు కూలీలను ఆదుకుంటామన్నారు.
Read also: Illness Cases : అనారోగ్యం బారిన పడిన పిల్లలపై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ఇళ్ల స్థలాలిస్తాం.. ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలిస్తామన్నారు. చదువుకున్న యువత సప్లయిర్ల ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ యువత బాధలు చూస్తోంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ప్రతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.. రైతు రుణ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రోజుకో దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు కేసీఆర్..! దంచుదాం.. దించుదాం.. సంపద పేదలకు పంచుదాం అని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీ తర్వాత కేసీఆర్ ఉండడు.. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదు అన్నారు. ఆడపిల్లలకు పెళ్లి కానుకతో పాటు తులం బంగారం పెడుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు. గ్రామంలో ఇంకా కొన్ని రోడ్లు పూర్తి కావాల్సి ఉన్నాయని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్లు కూడా వేయలేకపోయారని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు వేస్తామన్నారు.
Read also: Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ను వీడనున్న బుమ్రా.. కారణం అతడేనా?
మధిర నియోజకవర్గం చొప్పకట్లపాలెం గ్రామంలోని బొనకల్లు మండలం గ్రామ దేవాలయం వద్ద రూ.100 స్టాంపుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంతకం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తమదేనన్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామన్నారు.
Vetrimaaran: వడ చెన్నై కాంబినేషన్ రిపీట్… ఆ యాక్టర్ ని కలిసిన వెట్రిమారన్
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!