Bhatti Vikramarka: కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka sensational comments on CM KCR: కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని సీఎల్సీనేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా లో ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న ద్రోహి కేసీఅర్ అని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ ఇచ్చిన భూములను తీసుకున్నారని తెలిపారు. ధరణి పేరు మీద భూమిపై హక్కులు లేకుండా చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని తెలిపారు. ఇందారం, కోయ గూడెం ఓసీ, భూపాల పల్లి ఒసి లు ప్రైవేట్ వాళ్ళకు అప్పగించారన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నలుగురు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తున్నారని తెలిపారు. సహజవరులు కపాడుతాము ఉద్యోగాలు అన్ని స్థానికులకే ఇస్తామన్నారు. రాష్ట్ర సంస్థల్ని అమ్మకానికి పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తగుదు నమ్మా అని స్టీల్ ప్లాంట్ కి వెళ్తున్నారని ఎద్దేవ చేశారు. కాళేశ్వరం వల్ల పంటలు ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం మారిపోతుందని మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Read also: Sachin Pilot : సచిన్ పైలట్ నిరాహార దీక్ష.. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన కాంగ్రెస్ నేత
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ సర్కారు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బిడ్డింగులో పాల్గొనాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం/ ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ లేదంటే నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.
Sachin Pilot : సచిన్ పైలట్ నిరాహార దీక్ష.. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన కాంగ్రెస్ నేత
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
-
Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
-
Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!