Bhatti Vikramarka : పాత పాపాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై భట్టి కీలక వ్యాఖ్యలు.!
- పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యం : భట్టి విక్రమార్క
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై తక్షణ సాయం ₹600 కోట్లు
- మిగిలిన బకాయిలు విడతల వారీగా చెల్లింపు హామీ
- ప్రభుత్వ నిర్ణయంతో కళాశాలల బంద్ విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : పేద విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యత: ఫీజు రీయింబర్స్మెంట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్నాభిన్నం చేసి, బకాయిల భారాన్ని తమపై మోపిందని ఆరోపించారు.
“ఆ విచ్ఛిన్నాన్ని సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుండి రూ. 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను ప్రతినెలా కొంత చొప్పున చెల్లిస్తూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్ను విరమించాయని తెలిపారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?
చర్చల సందర్భంగా, కళాశాల యాజమాన్యాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా, ప్రభుత్వం అందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే.. కళాశాల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ, “పాత ప్రభుత్వం చేసిన పాపాలు మా నెత్తిన బడినప్పటికీ, మా యందు దయతలచి రూ. 600 కోట్లు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించింది. భవిష్యత్తులో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమై విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుందని ఆశిద్దాం.
Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!