Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం
- జూన్ 2 నుంచి అల్పాహార పథకం పునరుద్ధరణ
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విస్తరణ
- ‘యంగ్ ఇండియా’ రెసిడెన్షియల్ స్కూల్స్కు శ్రీకారం
- విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అక్షరజ్ఞానం , నాణ్యమైన విద్యపైనే ఆధారపడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ , ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించిన ఆయన, విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్ల పాలనలో రాష్ట్ర వనరులు విపరీతంగా దోపిడీకి గురికావడం వల్ల తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందని విమర్శించారు. వనరుల దోపిడీని అరికట్టి, ఆ సంపదను ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం వెచ్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ICC: టెస్ట్ క్రికెట్కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు నూతన పథకాలను ప్రకటించింది. జూన్ 2 నుంచి పాఠశాల విద్యార్థులందరికీ అల్పాహార పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు భట్టి వెల్లడించారు. అలాగే, ఇప్పటివరకు కేవలం పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. “అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడేలా ఎదగాలి” అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు ఉచితంగా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
Harish Rao : పొంగులేటి.. పొగరు తగ్గించుకో, నీ చిట్టా నా దగ్గర ఉంది..
రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచేందుకు 100 ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ స్కూల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయి వసతులు, బోధన అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం భవనాల నిర్మాణమే కాకుండా, విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, విద్యను సామాన్యుడికి చేరువ చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!