CLP Leader Mallu Bhatti Vikramarka Made Comments on Mana Ooru Mana Badi Program in Telangana Assembly Budget Sessions 2022.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకొని నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ పోచారం బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మాత్రమే ఉన్నారు. ఈ రెండు పార్టీ నేతల మధ్యే అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. నేడు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్ లో టీచర్ లు లేక ఇబ్బంది పడుతున్నారని, స్వీపర్లకు ఇంకా రూ. 2500 జీతమే ఇస్తున్నారని ఆయన అన్నారు.
అంతేకాకండా వాళ్ళను రెగ్యులర్ చేయండి… జీతాలు పెంచండని ఆయన డిమాండ్ చేశారు. మన ఊరు..మన బడి కి నిధులు పెట్టి పని చేస్తే బాగుంటుందని, ఎమ్మెల్యే ఫండ్ నుండి కట్ చేసి ఇస్తే… ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్దతి కాదని, నేను చదువుకునే రోజుల్లో కూడా సింగల్ టీచర్ ఉండేదని, ప్రభుత్వ స్కూల్ అంటే అప్పట్లో అందరూ దృష్టి పెట్టే వాళ్ళు అని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు ప్రజలు పెద్దగా దృష్టి పెట్టే వాళ్ళు లేరని ఆయన వ్యాఖ్యానించారు.