Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhadradri Temple Ready For Sriramanavami

Bhadradri Temple: ఏర్పాట్లు ముమ్మరం.. టికెట్ విక్రయాలపై అయోమయం

Published Date :April 1, 2022 , 8:02 am
By NTV WebDesk
Bhadradri Temple: ఏర్పాట్లు ముమ్మరం.. టికెట్ విక్రయాలపై అయోమయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

దక్షిణ అయోద్యగా వర్థిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే టిక్కెట్ల విక్రయాలను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్ల విక్రయాలన్నింటిని ఆన్ లైన్ లో పెట్టామని చేతులు దులుపుకుంటున్నారు దేవస్థానం అధికారులు. ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత భద్రాద్రి దేవాలయానికి శ్రీరామ నవమికి ఉంటుంది. శ్రీరామ నవమి నాడు శ్రీ
సీతారాముల కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో దేశ వ్యాపితంగా అదే సమయంలో జరగడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతుంది. దీనికి పెద్ద
ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి గోటి తలంబ్రాలను ఎక్కువ మంది భక్తులు తీసుకుని వస్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సైతం భక్తులు భద్రాచలంకు వచ్చి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించడం జరుగుతుంది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల నుంచి శ్రీరామ నవమి వేడుకలు జరుగలేదు. ప్రతి యేటా మిథిలా మండపంలో సీతారాముల కళ్యాణం అత్యంత రమణీయంగా జరుగుతుంటుంది. అయితే కరోనా వల్ల రెండు సంవత్సరాల నుంచి భక్తులు లేకుండానే అర్చకులు, వేద పండితులు మాత్రమే కళ్యాణాన్ని నిర్వహించారు. అయితే ఈసారి కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆశిస్తున్నారు. అయితే ఆన్ లైన్ లో విక్రయాలను మాత్రమే ఇప్పటి వరకు భద్రాచలం దేవస్థానం చేపట్టింది. ఆన్ లైన్ లో 14వేల టిక్కెట్ల విక్రయాలకు పెట్టారు. మార్చి నెల మొదటి వారంలో ఈ విక్రయాలను పెట్టినప్పటికి ఇప్పటి వరకు రెండు వేల టిక్కెట్లు మాత్రమే విక్రయించడం జరిగింది. నెల రోజులుగా ఆన్ లైన్ లో విక్రయాలు పెడితే కేవలం రెండు వేలు మాత్రమే విక్రయాలు జరిగాయి.

భద్రాచలంలో టికెట్ విక్రయాల కోసం కౌంటర్ లను ఏర్పాటు చేయలేదు. భద్రాచలంలో లక్షలాది రూపాయలను వెచ్చించి శ్రీరామ నవమి ఏర్పాట్ల ఉత్సవాలను చేస్తున్నారు. పట్టణం మొత్తం విద్యుత్ దీపాలతో కళ కళ లాడే విధంగా చేస్తున్నారు. స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే రెండేళ్ల తరువాత దేవస్థానం మిథిలా స్టేడియంలో భక్తుల సమక్షంలో శ్రీసీతారాముల కళ్యాణాన్నినిర్వహిస్తున్నప్పటికి టిక్కెట్ల విక్రయాలపై దృష్టి పెట్టడం లేదు.

టిక్కెట్ల విక్రయాల కౌంటర్ లు పెడితే మంచి ఆదాయం వచ్చేదని అంటున్నారు. శ్రీరామ నవమి విక్రయాలకు సంబంధించి ఎప్పుడో డిసైడ్ అయినప్పటికి ఇప్పటి వరకు విక్రయాల కోసం ఏర్పాట్లను మాత్రం చేయలేదు. ఈ టిక్కెట్ల విక్రయాల వల్ల ప్రతి యేడాది 1.3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈసారి టిక్కెట్ల విక్రయాల రేట్లను పెంచారు. దీని వల్ల రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

https://ntvtelugu.com/final-exam-dates-change-from-1st-class-to-9th-class-in-telangana-and-summer-holidays-from-24th-april/

మరోవైపున టిక్కెట్ల విక్రయాలకు ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయలేని దేవస్థానం.. టిక్కెట్ల రేట్లను మాత్రం భారీగా పెంచడం విమర్శలకు తావిస్తోంది. వంద రూపాయల టిక్కెట్ల వద్ద నుంచి అయిదు వేల రూపాయల ఉభయ దాతల టిక్కెట్ల నుంచి అన్నిరేట్లను ఇష్టం వచ్చినట్లుగా పెంచేశారు. వంద రూపాయల టిక్కెట్ 150రూపాయలకు పెంచారు. అదేవిధంగా ఇప్పుడు టిక్కెట్లు అన్ని 150, 300, 1000, 2000, 2,500, 7,500 రూపాయల టిక్కెట్లు ఇప్పుడు అందుబాటులో భక్తుల కోసం ఉన్నాయి. రేట్లను పెంచడంతో దేవస్థానంకు మరింత ఆదాయం వస్తుందని భావించినా, దానికి అనుగుణంగా మాత్రం ఏర్పాట్లను చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhadrachalam
  • Mithila stadium
  • online tickets
  • sriramanavami
  • telangana ayodhya

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions