Singareni Workers: ఎల్లో, రెడ్ వార్నింగ్ కార్డులు రద్దు చేయండి.. కార్మిక సంఘాల లేఖలు
- సింగరేణి లో కార్మికులకు ఎల్లో- రెడ్ వార్నింగ్ కార్డులు..
- ఏరియల వారీగా గనులకు సర్క్యులర్లు పంపిన రక్షణ విభాగం..
- చర్చించకుండా ఆదేశాలు జారీ చేశారని కార్మిక సంఘాల ఆగ్రహం..
- ఎల్లో -రెడ్ కార్డ్స్ ను రద్దు చేయాలంటూ కార్మిక సంఘాల లేఖలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Workers: సింగరేణి లో కార్మికులకు ఎల్లో, రెడ్ వార్నింగ్ కార్డులు జారీ చేయడంతో సింగరేణి కార్మకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గని ప్రమాదాలకు కార్మికులను బాద్యులుగా చేసేందుకు యాజమాన్యం కుట్ర చేస్తుందంటూ కార్మిక సంఘాలు మండి పడుతున్నారు. రక్షణ విభాగం ఏరియల వారీగా గనులకు సర్క్యులర్లు పంపించింది. కార్మికులు ఒకసారి తప్పు చేస్తే ఎల్లో (పసుపు )కార్డు , 3 సార్లు తప్పు చేస్తే రెడ్ కార్డు జారీ చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గని ప్రమాదాలకు అక్కడున్న రక్షణ చర్యలు కారణం అయితే.. కార్మికులను బలి చేయడంఏంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా ఏ తప్పు జరిగిన అధికారులు ఇక ఎల్లో కార్డు జారీ చేయనున్నారు. చర్చించకుండా అంతర్గతంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసిందంటు కార్మిక సంఘాల మండిపడుతున్నాయి. ఎల్లో ,రెడ్ కార్డ్స్ ను రద్దు చేయాలంటూ యాజమాన్యానికి కార్మిక సంఘాల లేఖలు పంపారు.
Read also: Traffic Challans: హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 11.5 లక్షల చలాన్లు..!
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
గతంలో గనిలో కార్మికుడు తప్పు చేస్తే విచారణ జరిపి తప్పు రుజువైతే చార్జిషీటు వేయడమో, మరేదైనా చర్యలు తీసుకోవడమో చేసేవారు. డీజీఎంఎస్ విచారణ కూడా జరిగింది. యాజమాన్యం ఇలాంటి విచారణలకు స్వస్తి పలికింది. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల్లో నిరుద్యోగులు కూడా ఉన్నారు. సెల్ ఫోన్లలో వచ్చే మెసేజ్ లు చదవకుంటే యాజమాన్యం చర్యలు తీసుకునే వరకు కూలీకి తెలియని పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు, రక్షణ పరికరాలు కల్పించకుండా తప్పు చేసిన కార్మికునిపై పసుపు, ఎరుపు కార్డులు తీసుకురావడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read also: Child Selling: కన్న కూతురిని లక్ష రూపాయలకు అమ్మిన కసాయి తండ్రి..
కార్మికులకు సరైన రక్షణ పరికరాలైన బూట్లు, హెల్మెట్లు తదితరాలు అందజేయక, కాలం చెల్లిన యంత్రాలతో పని చేస్తుంటే ప్రమాదాలు ఎలా నివారించగలం? దీనికి కార్మికుడిని బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికులు బలిదానాలు చేస్తున్నారు. రెడ్ కార్డ్ ఉన్న ఉద్యోగిపై ఛార్జిషీటుతో పాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్ కోత, తొలగింపు వంటి తీవ్రమైన క్రమశిక్షణా చర్యలకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. పసుపు, ఎరుపు కార్డుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.
Kishan reddy: ఆ రెండు పార్టీలు కవల పిల్లలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..