Bhadradri Mahotsavam: నేటి నుంచి శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Mahotsavam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము నందు నేటి నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహ్నిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు రామాలయంలో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి కల్యాణానికి పసుపు దంచి, ముత్యాల తలంబ్రాలు కలపనున్నారు. నేడు శ్రీరామచంద్రుని పెళ్లి కొడుకుగా అలంకరించనున్నారు. ఇక మరోవైపు శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నేటి నుంచి ప్రారంభించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని చూసేందుకు సెక్టార్ టిక్కెట్లు నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీరామ నవమి రోజున, ఉభయ దాతల టిక్కెట్టు రుసుము రూ.7,500, ఇద్దరు వ్యక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఒకరికి రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లు ఇస్తారు. 18న జరిగే పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన సెక్టార్ టిక్కెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు.
Read also: Holi in Nizamabad: హున్సాలో పిడిగుద్దుల హోలీ.. ఐక్యమత్యంతో ఆట
Also Read
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
- CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇక మరోవైపు భక్తులు https://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్లో టిక్కెట్లు పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణం రోజు నేరుగా రాలేని భక్తులు కూడా పరోక్షంగా తమ గోత్రనామాలతో పూజలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం రూ.5 వేలు, రూ.1116 టిక్కెట్లను ఇదే వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఆన్లైన్లో సెక్టార్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు టిక్కెట్లు తీసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి 17 ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయంలో (తానీషా కల్యాణ మండపం) ఒరిజినల్ ఐడీ కార్డులను సమర్పించాల్సి ఉంటుందని ఈవో వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా భద్రాచలం రామమందిరం, తానీషా కల్యాణ మండపం, గోదావరి వంతెన సెంటర్లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని తెలిపారు.
JNUSU Election : ఏబీవీపీకి షాక్.. జేఎన్యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎగిరిన లెఫ్ట్ జెండా
తాజావార్తలు
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..