Bhadradri Mahotsavam: నేటి నుంచి శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Mahotsavam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము నందు నేటి నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహ్నిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు రామాలయంలో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి కల్యాణానికి పసుపు దంచి, ముత్యాల తలంబ్రాలు కలపనున్నారు. నేడు శ్రీరామచంద్రుని పెళ్లి కొడుకుగా అలంకరించనున్నారు. ఇక మరోవైపు శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నేటి నుంచి ప్రారంభించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని చూసేందుకు సెక్టార్ టిక్కెట్లు నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీరామ నవమి రోజున, ఉభయ దాతల టిక్కెట్టు రుసుము రూ.7,500, ఇద్దరు వ్యక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఒకరికి రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లు ఇస్తారు. 18న జరిగే పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన సెక్టార్ టిక్కెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు.
Read also: Holi in Nizamabad: హున్సాలో పిడిగుద్దుల హోలీ.. ఐక్యమత్యంతో ఆట
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
ఇక మరోవైపు భక్తులు https://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్లో టిక్కెట్లు పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణం రోజు నేరుగా రాలేని భక్తులు కూడా పరోక్షంగా తమ గోత్రనామాలతో పూజలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం రూ.5 వేలు, రూ.1116 టిక్కెట్లను ఇదే వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఆన్లైన్లో సెక్టార్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు టిక్కెట్లు తీసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి 17 ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయంలో (తానీషా కల్యాణ మండపం) ఒరిజినల్ ఐడీ కార్డులను సమర్పించాల్సి ఉంటుందని ఈవో వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా భద్రాచలం రామమందిరం, తానీషా కల్యాణ మండపం, గోదావరి వంతెన సెంటర్లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని తెలిపారు.
JNUSU Election : ఏబీవీపీకి షాక్.. జేఎన్యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎగిరిన లెఫ్ట్ జెండా
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?