Pakistan: ఉగ్రవాదుల భయంతో ఇళ్లలో దాక్కుంటున్న పాకిస్తానీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల భయంతో పోలీసు అధికారులు సైతం ఇళ్లలోనే తలదాచుకునే పరిస్థితి ఏర్పాడింది. యూనిఫాం వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో దాదాపు 1200 మంది పోలీసు అధికారులు, సైనికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉగ్రవాదుల భయం ఎంత స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు.. పోలీసు అధికారులు గస్తీకి కూడా వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.. పోలీసు స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Read Also: Delhi : స్కూటర్ పై తీసుకెళ్తుండగా రూ.3 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు
Also Read
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ఇక, పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో సుమారు 1200 మంది పోలీసులు రెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు. లోయర్ సౌత్ వజీరిస్తాన్, టోయ్ ఖోలా, స్పెయిన్, తానై, షికాయ్, ఆజం వార్సక్, జగ్జాయ్లోని ఆరు పోలీస్ స్టేషన్లు.. వాటికి సంబంధించిన అధికారులు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. దక్షిణ వజీరిస్థాన్లో సమ్మెలో ఉన్న పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించినందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. తమ చట్టపరమైన అధికారాలను వినియోగించుకోవడానికి కూడా అనుమతించడం లేదని వారు అంటున్నారు.
Read Also: India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..
అయితే, రాత్రిపూట తీవ్రవాద దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట కూడా పెట్రోలింగ్ వెళ్లడం లేదు.. ఈ కారణంగానే చాలా మంది అధికారులు తమ వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారని అంటున్నారు. వివిధ చెక్పోస్టుల వద్ద పారామిలటరీ బలగాలతో సంయుక్తంగా మోహరించడం మరో ప్రధాన సమస్య.. వారు ఈ చెక్పోస్టుల దగ్గర పోలీసుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?