Pakistan: ఉగ్రవాదుల భయంతో ఇళ్లలో దాక్కుంటున్న పాకిస్తానీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల భయంతో పోలీసు అధికారులు సైతం ఇళ్లలోనే తలదాచుకునే పరిస్థితి ఏర్పాడింది. యూనిఫాం వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో దాదాపు 1200 మంది పోలీసు అధికారులు, సైనికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉగ్రవాదుల భయం ఎంత స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు.. పోలీసు అధికారులు గస్తీకి కూడా వెళ్లేందుకు వెనుకాడుతున్నారు.. పోలీసు స్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Read Also: Delhi : స్కూటర్ పై తీసుకెళ్తుండగా రూ.3 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
ఇక, పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో సుమారు 1200 మంది పోలీసులు రెండు రోజులుగా సమ్మెలో ఉన్నారు. లోయర్ సౌత్ వజీరిస్తాన్, టోయ్ ఖోలా, స్పెయిన్, తానై, షికాయ్, ఆజం వార్సక్, జగ్జాయ్లోని ఆరు పోలీస్ స్టేషన్లు.. వాటికి సంబంధించిన అధికారులు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు. దక్షిణ వజీరిస్థాన్లో సమ్మెలో ఉన్న పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించినందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణలపై పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. తమ చట్టపరమైన అధికారాలను వినియోగించుకోవడానికి కూడా అనుమతించడం లేదని వారు అంటున్నారు.
Read Also: India-Pakistan Relations: భారత్తో మెరుగైన సంబంధాల కోసం పాకిస్థాన్లో డిమాండ్..
అయితే, రాత్రిపూట తీవ్రవాద దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట కూడా పెట్రోలింగ్ వెళ్లడం లేదు.. ఈ కారణంగానే చాలా మంది అధికారులు తమ వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ విధులు నిర్వహించేందుకు వినియోగిస్తున్నారని అంటున్నారు. వివిధ చెక్పోస్టుల వద్ద పారామిలటరీ బలగాలతో సంయుక్తంగా మోహరించడం మరో ప్రధాన సమస్య.. వారు ఈ చెక్పోస్టుల దగ్గర పోలీసుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..