Tribal Attack: ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు.. నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tribal Attack: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాచలం కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు 2022లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రు కొండ మండలం బెండలపాడు గ్రామ పరిధిలోని గుత్తి కోయలు నివసించే ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుని ఇద్దరు గొత్తికోయాలు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య సంఘటన రాష్ట్రంలో సంచనలం కలిగించింది భద్రాద్రి జిల్లాలో పోడు వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ పరిధిలో పోడు భూములను స్వాదినం చేసుకొని అక్కడ ప్లాంటేషన్ నిర్మించారు. ప్లాంటేషన్ కొట్టడానికి వెళ్లిన గుత్తి కోయిలను ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అడ్డుకున్నాడు. దీంతో శ్రీనివాసరావుని ఇద్దరు గుత్తి కోయలు వేట కొడవల్లతో నరికి హత్య చేశారు. ఈ హత్య ఘటన సంచలన కలిగించింది. మరోవైపున ఫారెస్ట్ సిబ్బంది తాము గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read also: Karthikeya: ‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’…
Also Read
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
- Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
దీంతో రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చింది. ఫారెస్ట్ సిబ్బందికి అన్ని రకాల అండదండలు ఉంటామని హామీలు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి, వారిని జైలుకు పంపించారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కొత్తగూడెం కోర్టు ఈరోజు జీవితఖైదీ విధించింది. నిందితులు మడకం తులా, పొడియం నంగాకు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది నవంబర్ లో చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో రేంజర్ శ్రీనిసరావును వేటకొడవల్లతో గొత్తికోయ సమూహానికి చెందిన తులా, నంగా లు కిరాతకంగా దాడి చేయడంతో.. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం శ్రీనివాస్ రావు కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల శ్రీనివాస్ రావు భార్యను కారుణ్య నియామకం కింద డిప్యూటీ తహశీల్దార్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే విధంగా 500 గజాల స్థలం కూడా ఇచ్చింది.
Double Bedroom: లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం
తాజావార్తలు
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!