Techie Couple’s Suicide: బెంగళూర్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు జంట ఆత్మహత్య కన్నీటిని తెప్పిస్తోంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత సంఘటనకు కారణాలు తెలుస్తున్నాయి. ఈ విషాద ఘటనకు మానసిక ఒత్తిడి, ఆర్తిక ఇబ్బందులు, ఉద్యోగం పోవడం కారణమని తెలిసింది. తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాను చంద్రరెడ్డి(32) సోమవారం తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన ఐబీఎంతో పనిచేస్తున్న ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Read Also: Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..
ఈ జంట ఆత్మహత్యల్లో కన్నీటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత బాను చంద్ర రెడ్డి బెంగళూర్లో ఉద్యోగం కోసం ఏడాదిగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోయానని, దీని వల్ల ఆదాయం లేకుండా పోయిందని ఆయన మనోవేధకు గురవుతున్నట్లు తేలింది.
చాలా కాలంగా ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడం వల్ల బానుచంద్రరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి తోడు మతాంతర వివాహం చేసుకోవడం వల్ల కుటుంబ మద్దతు లేకపోవడం కూడా మానసికంగా కుంగదీసింది. తెలంగాణలో బలమైన రాజకీయ సంబంధాలు ఉన్న అతడి తండ్రి వివాహాన్ని వ్యతిరేకించడంతో కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. కుటుంబం నుంచి మద్దతు కరువై, ఉద్యోగం లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. తన ఆత్మహత్యకు తన భార్యను నిందించొద్దని రాసిన సూసైట్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేని షాజియా కూడా సూసైడ్ చేసుకుంది.
