Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కారును దొంగిలించాలనే పక్కా ప్లాన్తో మహారాష్ట్రకు చెందిన ఓ గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగురు దుండగుల ముఠా ప్యాసింజర్ల రూపంలో రాజశేఖర్ క్యాబ్ను సంగారెడ్డి వెళ్లేందుకు బుక్ చేసుకున్నారు. ప్రయాణం ప్రారంభమై పటాన్చెరు దాటిన తర్వాత దుండగులు తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్తో “నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావ్, కావాలంటే మేము డ్రైవింగ్ చేస్తాం” అని నమ్మబలికారు.
అతనిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా డ్రైవింగ్ సీటు నుంచి పక్క సీటుకు మార్చారు. కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెనుక సీట్లో ఉన్న ఒక దుండగుడు అకస్మాత్తుగా వైర్తో రాజశేఖర్ మెడకు ఉరి బిగించగా, పక్కనే ఉన్న మరో వ్యక్తి అతని ముఖంపై బలంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత, దుండగులు అతని మృతదేహాన్ని రుద్రారం వద్ద రోడ్డు పక్కన పారవేసి కారుతో పరారయ్యారు.
Also Read
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
మొరాయించిన కారు.. ఫోన్ సిగ్నల్స్తో కేసు ఛేదన
హత్య అనంతరం కారుతో జహీరాబాద్ వైపు పారిపోతున్న గ్యాంగ్కు కోహీర్ వద్ద ఊహించని షాక్ తగిలింది. కారు సాంకేతిక సమస్యతో హఠాత్తుగా మొరాయించి ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో, చేసేదేమీ లేక దుండగులు తాళాలను కారుపైనే వదిలేసి అక్కడ నుంచి కాలినడకన పరారయ్యారు. ఆ తర్వాత జహీరాబాద్ చేరుకున్న దుండగులు రాజశేఖర్ వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ ఫోన్ను స్థానిక షాప్లో రూ.3,000లకు అమ్మి నగదు తీసుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. అయితే, రాజశేఖర్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదరు మొబైల్ షాప్ నిర్వాహకుడిని విచారించగా నలుగురు వ్యక్తులు వచ్చి ఫోన్ అమ్మినట్లు వెల్లడించాడు. దీంతో షాప్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, వారి కోసం ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?