Battini Harinath: బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Battini Harinath:హైదరాబాద్ చేప మందుగా పేరుగాంచిన బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్ బొలక్ పూర్ పద్మశాలి కాలనీలో ఆయన నివాసంలో పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. బత్తినీ హరినాథ్ గౌడ్ కు బార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీ లోని దూద్ బౌలి కి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ వీరిలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా బుధవారం హరినాథ్ గౌడ్ మృతి చెందగా విశ్వనాథ్ ఒక్కరే ఉన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు.
Read also: Krithi Shetty: కనులవిందు చేస్తున్న బుల్లెట్ బ్యూటీ “క్రితి శెట్టి”..
Also Read
1847లో హైదరాబాద్ నగరంలో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు చేప ప్రసాదం పంచేవాడు. ఆయన కుమారుడు బత్తిని శివరామ గౌడ్ మరియు అతని కుమారుడు బత్తిని శంకర్ గౌడ్ ప్రతి సంవత్సరం ఈ ప్రసాదాన్ని అందజేస్తూనే ఉన్నారు. శంకర్ గౌడ్ , సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారులు బత్తిని హరినాథ్ గౌడ్ , బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ , వారి కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. గత 176 ఏళ్లుగా చేపల మందు పంపిణీ చేస్తున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. గతేడాది నుంచి చేపల ఆహారం కోసం వచ్చే వారికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
Astrology: ఆగస్టు 24, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..