Bhatti Vikramarka: కేసీఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ ఢిల్లీలో.. కేటీఆర్ ఇంట్లో..! అసలు పాలన ఉందా.. రాష్ట్రంలో..? అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎనిమిది యేండ్ల అధాయం, అప్పులు కాళేశ్వరంలో ధార పోశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. వరదకు మొత్తం మునిగిపోయిందని మండిపడ్డారు. కట్టిన వాల్స్ కూలి పోయాయని, ఎనిమిది యేండ్ల సంపదను అప్పులు, నిరుపయోగంగా మారిపోయిందని విమర్శించారు. అసలు ఏం జరుగుతుంది అనే పరిశీలనకు వెళ్తే కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Kgf మైన్ లోకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళ ఫోన్ లు తీసుకున్నట్టు.. కాళేశ్వరంలో ఉద్యోగులను కూడా అలాగే చేస్తున్నారని బట్టి విమర్శించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారు? అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇంట్లోనే రెస్ట్ లో ఉన్నారని ఎద్దేవ చేసారు. రాష్ట్ర అతలాకుతలం అవుతుందటే.. ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు పాలన ఉందా..? రాష్ట్రంలో అంటూ ప్రశ్నించారు.
read also:Harassment: మొన్న ప్రిన్సిపల్.. నేడు టీచర్.. కీచక బాగోతం
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
కాళేశ్వరం ప్రాజెక్ట్ నీ సిఎల్పీ నేతగా విజిట్ చేస్తా అంటూ బట్టి అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే లంతా కలిసి వెళ్తామని తెలిపారు. అందరినీ అపినట్టు మమ్మల్ని ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వరద నష్టం ఎక్కువ జరిగిందని, రైతులు దెబ్బ తిన్నారని గుర్తు చేసారు. వెంటనే శాసన సభను సమావేశ పరచాలని డిమాండ్ చేసారు. వరదలు, నష్టం పై చర్చ చేద్దామని పిలుపు నిచ్చారు. రాజగోపాల్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే.. ఆయన తో నేనని, అధిష్టానం మాట్లాడిందని స్పష్టం చేసారు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉండేలా చూస్తున్నామని అన్నారు. ప్రజలు ఉప ఎన్నికలు కోరుకోలేదు కదా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడొద్దని బుజ్జగిస్తూ ఉన్నామని భట్టి స్పష్టం చేసారు. రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం, మాట్లాడుతుందని, మేము మాట్లాడుతూ ఉన్నామని తెలిపారు. పార్టీ లో మీకు ఉన్న ఇబ్బందులు ఏంటని రాజగోపాల్ ను అడుగుతున్నామని అన్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ ను ఓడించే బలం కాంగ్రెస్ కే ఉందని స్పష్టం చేసారు. కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి దీన్ని బాగు చేయడం ఎలా అనేది తెలుసని అన్నారు. కాంగ్రెస్ ఎవరికి, దేనికి భయపడదని అన్నారు. నోటీసులు ఇవ్వడానికి భయం కాదు, మా పార్టీ నాయకుడిని కాపాడుకోవడం కోసం తపన అంటూ భట్టి విక్రమార్క స్పష్టం చేసారు.
Commonwealth Games: ఫైనల్స్కి దూసుకెళ్లిన శ్రీహరి.. పతకం సాధిస్తే ఆ రికార్డ్ సొంతం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!