Basara IIIT: నేడు విశ్వవిద్యాలయాలు బంద్.. ఓయూ JAC పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసరలో అసలు ఏం జరుగుతోంది. ప్రతిసారి విద్యార్థులకు ఎదో ఒక సమస్య ఎందుకు ఎదురవుతోంది. నిజంగా ఇది విద్యార్థుల సమస్యేనా? లేక మరేదైననా? ప్రభుత్వం సమస్యలు తీరుస్తున్నా మళ్లీ ఎందుకు ఇలా సమస్యలు? విద్యార్థులకు సౌకర్యాలు ఎందుకు లేవు? త్రిబుల్ ఐటీ రాజకీయంగా టార్గెట్ చేశారా? ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతిఒక్కరికి తలెత్తుతున్నాయి. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలున్నాయని విద్యార్థులు ఆందోళన చేసిన ఘటన కొన్ని నెలలుగా తలెత్తునే వున్నాయి.
సౌకర్యాలు కల్పించాలంటూ రాత్రి, పగలు అని తేడాలేకుండా వారి సమస్యలు తీర్చేంతవరకు విద్యార్థులు వర్షంలోనూ నిరసనలు, ధర్నాలు చేశారు. విద్యాశాఖ మంత్రి, పలునాయకులు త్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లి తీరుస్తామని చెప్పడంతో సమస్య సర్దుమనిగింది. అయితే మళ్లీ త్రిపుల్ ఐటీలో భోజన వసతులు బాగాలేవని, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గుట్టుచప్పుడు కాకుండా అక్కడే వైద్యం అందించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. దీంతో విద్యార్థులకు ఫోన్లు అనుమతించలేదు. విద్యాసంస్థలో ఏం జరిగినా బయటకు వెళ్లకుండా భారీ పోలీసులు మోహరించారు. లోపల విషయాలు బయటకు, బయట విషయాలు లోనికి వెళ్లకుండా పకడ్బంది ఏర్పాట్లు చేశారు. తరువాత వంట షాలల్లోనే స్నానాల విషయంలో మళ్లీ వివాదంగా మారింది. ఆవిషయం కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. త్రిబుల్ ఐటీలో ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ఇంటికి వెళ్లాడు కానీ విద్యాసంస్థలో భోజనం చేయడం వలనే మృతి చెందాడని విద్యార్థి కుటుంబ సభ్యులు త్రిపుల్ఐటీ గేటు వద్ద కూర్చొని నిరసన చేపట్టారు. దాంతో మరోమారు వార్తల్లోకి ఎక్కింది.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
బాసర ట్రిపుల్ ఐటీలో సురేశ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. దీంతో.. ఇవాళ యూనివర్సిటీల బంద్ కు ఓయూ JAC పిలుపునిచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేశ్ మృతికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సురేశ్ మృతి ప్రభుత్వ హత్యేనని, విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
నిన్న హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ను కానీ, వైద్యాధికారులను కానీ పిలిపించలేదని మండిపడ్డారు. అధికారుల తీరుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ చాంబర్ ముట్టడికి యత్నించారు. పక్కనే ఉన్న సీఐ వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Stotra Parayanam LIVE: చివరి శ్రావణ బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!