Basara IIIT: నేడు విశ్వవిద్యాలయాలు బంద్.. ఓయూ JAC పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసరలో అసలు ఏం జరుగుతోంది. ప్రతిసారి విద్యార్థులకు ఎదో ఒక సమస్య ఎందుకు ఎదురవుతోంది. నిజంగా ఇది విద్యార్థుల సమస్యేనా? లేక మరేదైననా? ప్రభుత్వం సమస్యలు తీరుస్తున్నా మళ్లీ ఎందుకు ఇలా సమస్యలు? విద్యార్థులకు సౌకర్యాలు ఎందుకు లేవు? త్రిబుల్ ఐటీ రాజకీయంగా టార్గెట్ చేశారా? ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతిఒక్కరికి తలెత్తుతున్నాయి. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలున్నాయని విద్యార్థులు ఆందోళన చేసిన ఘటన కొన్ని నెలలుగా తలెత్తునే వున్నాయి.
సౌకర్యాలు కల్పించాలంటూ రాత్రి, పగలు అని తేడాలేకుండా వారి సమస్యలు తీర్చేంతవరకు విద్యార్థులు వర్షంలోనూ నిరసనలు, ధర్నాలు చేశారు. విద్యాశాఖ మంత్రి, పలునాయకులు త్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లి తీరుస్తామని చెప్పడంతో సమస్య సర్దుమనిగింది. అయితే మళ్లీ త్రిపుల్ ఐటీలో భోజన వసతులు బాగాలేవని, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గుట్టుచప్పుడు కాకుండా అక్కడే వైద్యం అందించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. దీంతో విద్యార్థులకు ఫోన్లు అనుమతించలేదు. విద్యాసంస్థలో ఏం జరిగినా బయటకు వెళ్లకుండా భారీ పోలీసులు మోహరించారు. లోపల విషయాలు బయటకు, బయట విషయాలు లోనికి వెళ్లకుండా పకడ్బంది ఏర్పాట్లు చేశారు. తరువాత వంట షాలల్లోనే స్నానాల విషయంలో మళ్లీ వివాదంగా మారింది. ఆవిషయం కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. త్రిబుల్ ఐటీలో ఒక విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ఇంటికి వెళ్లాడు కానీ విద్యాసంస్థలో భోజనం చేయడం వలనే మృతి చెందాడని విద్యార్థి కుటుంబ సభ్యులు త్రిపుల్ఐటీ గేటు వద్ద కూర్చొని నిరసన చేపట్టారు. దాంతో మరోమారు వార్తల్లోకి ఎక్కింది.
Also Read
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
బాసర ట్రిపుల్ ఐటీలో సురేశ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. దీంతో.. ఇవాళ యూనివర్సిటీల బంద్ కు ఓయూ JAC పిలుపునిచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేశ్ మృతికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సురేశ్ మృతి ప్రభుత్వ హత్యేనని, విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
నిన్న హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ను కానీ, వైద్యాధికారులను కానీ పిలిపించలేదని మండిపడ్డారు. అధికారుల తీరుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ చాంబర్ ముట్టడికి యత్నించారు. పక్కనే ఉన్న సీఐ వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Stotra Parayanam LIVE: చివరి శ్రావణ బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!