Hyderabad:రాత్రి 11 గంటల తరువాత పబ్బులు, మద్యం బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్ ఉన్న హోటల్కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్కు అపఖ్యాతి తీసుకురావద్దని పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డ్రైవ్- ఇన్ రెస్టారెంట్స్ యజమానులకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హైదరాబాద్లో ఉన్న పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఇటీవల బంజారాహిల్స్లో పుడింగ్ అండ్ మింక్ పబ్లో తనిఖీలు చేసిన పోలీసులకు కొకైన్ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదని, దీంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొని పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్ మారిందని తెలిపారు. ఇలాంటి సమయంలో.. కొంత మంది బార్లు, పబ్బుల యజమానులు చిన్న చిన్న లాభాల కోసం నిబంధనలు అతిక్రమిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పబ్బులు, బార్ల నుంచి వెలువడే ధ్వనులు పరిమితి స్థాయి కంటే అధికంగా ఉండటం, పబ్బులకు వచ్చిపోయే వారి వాహనాలతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, మద్యం మత్తులో బయటకు వచ్చిన కొందరు రహదారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఆయా ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాలకు సంబంధించిన బ్యాకప్ 30 రోజులు తప్పని సరిగా ఉండాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి,చర్యలు తీసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
రాత్రి 11 గంటల తరువాత వచ్చే ఆర్డర్లను అనుతించవద్దని, 12 గంటల లోపు తమ సంస్థలను మూసేయాలని సీపీ సూచించారు. వీకెండ్స్ (శుక్ర, శని వారాల) దృష్ట్యా అరగంట గ్రేస్ పీరియడ్తో పాటు అదనంగా ఒక గంట మినహాయింపు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందే లైట్లను డిమ్ చేస్తారని, తద్వారా కస్టమర్లకు పబ్బు మూసేసే సమయం అయ్యిందని తెలిసిపోతున్నదన్నారు. నగరంలో కూడా ఈ పద్ధతిని పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ వీఆర్.శ్రీనివాస్, జాయింట్ సీపీలు రమేశ్, విశ్వప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Delhi Fire Accident: ఢిల్లీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి..
- Tags
- alcohol
- Bars
- hyderabad
- pubs
- Restaurants
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..