Bandi sanjay: నమ్మకం లేదన్నా నోటీసులు ఇచ్చారు.. నేడు సిట్ ముందుకు లీగల్ టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi sanjay: Tspsc పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్కు సిట్ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్ నోటీసులు తనకు రాలేదని, సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు. ఉదయం 11 గంటలకు సిట్ ఆఫిస్ కు బండి సంజయ్ లీగల్ టీం వెల్లింది. దీంతో సంజయ్ లీగల్ టీం తో సిట్ విచారిస్తుంది. వారినుంచి ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయనే దానిపై సిట్ విచారణ కొనసాగుతుంది.
Read also: Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
సిట్ నోటీస్ లకు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. నాకు సిట్ మీద నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాలు బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపానని అన్నారు. అయినా కూడా మళ్ళీ నోటీస్ లు ఇచ్చారని మండిపడ్డారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని అన్నారు. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కాం ను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండని సంజయ్ పేర్కొన్నారు. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చిందని, దాన్ని ప్రజల ముందు పెట్టానని అన్నారు. ప్రజా ప్రతినిధిగా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుందని తెలిపారు. ఈ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నానని అన్నారు. అసలు విషయం పై విచారణ జరపకుండా సిట్ నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో నేను హాజరు కావడం లేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. ఈనేపథ్యంలో బండి సంజయ్ బదులు లీగల్ టీం హాజరవుతుందని వెల్లడించారు. అయితే బండి సంజయ్ లీగల్ టీం, సిట్ కు ఎలాంటి ఆధారాలు సమర్పించనుంది, ఏం చెప్పనుంది అనేదానిపై ఉత్కంఠత నెలకొంది.
Love Failure: లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధగా ఉంటుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే..
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!