Bandi Sanjay: రాజకీయ సమీకరణాలు మారతాయి.. పాదయాత్రతో కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర చేసి, ఈరోజు అడెల్లి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, 5వ విడత పాదయాత్రను ప్రారంభించినట్టు వెల్లడించారు..
Read Also: CST Tax Cancelled on Rice Export: రైతులకు, మిల్లర్లకు సీఎం గుడ్న్యూస్.. ఆ పన్ను రద్దు
Also Read
ఇక, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత విద్య, వైద్యం హామీని నెరవేరుస్తాం అని ప్రకటించారు బండి సంజయ్.. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇస్తాం, తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామన్న ఆయన.. పేదల కోసమే మా ఈ ప్రజా సంగ్రామ యాత్ర అన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి.. మా పాదయాత్రతో కేసీఆర్కు వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని ఎద్దేవా చేశారు.. కుట్రలో భాగంగానే ఇవాళ మా పాదయాత్రను కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన ఆయన.. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతోనే నన్ను అడ్డుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారని.. అసలు భైంసాను సెన్సిటివ్ ప్లేస్ గా మార్చింది ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కుంటి సాకులు చెప్పి, పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే… గౌరవ హైకోర్టులో పిటిషన్ వేసి, అనుమతి పొందామన్నారు బండి సంజయ్.. కోర్టు ఉత్తర్వులకు లోబడి మా పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.. ఇవాళ మా పాదయాత్రను చెప్పిన టైమ్ ప్రకారం స్టార్ట్ చేశాను.. అడెల్లి పోచమ్మ అమ్మవారి పాదాల చెంత 5వ విడత పాదయాత్ర ప్రారంభించాం.. గౌరవ హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కార్వాన్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నదే కేసీఆర్ అండ్ బ్యాచ్ అని ఆరోపించారు.. ఒక మహిళ అని కూడా చూడకుండా.. షర్మిలను అరెస్టు చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!