Bandi Sanjay: రాజకీయ సమీకరణాలు మారతాయి.. పాదయాత్రతో కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర చేసి, ఈరోజు అడెల్లి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, 5వ విడత పాదయాత్రను ప్రారంభించినట్టు వెల్లడించారు..
Read Also: CST Tax Cancelled on Rice Export: రైతులకు, మిల్లర్లకు సీఎం గుడ్న్యూస్.. ఆ పన్ను రద్దు
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఇక, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత విద్య, వైద్యం హామీని నెరవేరుస్తాం అని ప్రకటించారు బండి సంజయ్.. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇస్తాం, తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామన్న ఆయన.. పేదల కోసమే మా ఈ ప్రజా సంగ్రామ యాత్ర అన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి.. మా పాదయాత్రతో కేసీఆర్కు వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని ఎద్దేవా చేశారు.. కుట్రలో భాగంగానే ఇవాళ మా పాదయాత్రను కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన ఆయన.. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతోనే నన్ను అడ్డుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారని.. అసలు భైంసాను సెన్సిటివ్ ప్లేస్ గా మార్చింది ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కుంటి సాకులు చెప్పి, పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే… గౌరవ హైకోర్టులో పిటిషన్ వేసి, అనుమతి పొందామన్నారు బండి సంజయ్.. కోర్టు ఉత్తర్వులకు లోబడి మా పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.. ఇవాళ మా పాదయాత్రను చెప్పిన టైమ్ ప్రకారం స్టార్ట్ చేశాను.. అడెల్లి పోచమ్మ అమ్మవారి పాదాల చెంత 5వ విడత పాదయాత్ర ప్రారంభించాం.. గౌరవ హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కార్వాన్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నదే కేసీఆర్ అండ్ బ్యాచ్ అని ఆరోపించారు.. ఒక మహిళ అని కూడా చూడకుండా.. షర్మిలను అరెస్టు చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!