Bandi Sanjay Arrest: ఖైదీ నెంబర్ 7917.. జైల్లో ఎలా ఉన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Arrest: తెలంగాణ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ ని పోలీసులు కరీంనగర్ జైలులో ఉంచారు. బండి సంజయ్ రిమాండ్ ను సవాల్ చేస్తూ బీజేపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు CJ విచారణ చేపట్టన్నారు. కాగా.. పరీక్ష సమయానికి ప్రశ్నపత్రం బయటకు వచ్చి సోషల్ మీడియా గ్రూపుల్లో కనిపించడంతో పోలీసులు సంజయ్ను రోల్ ప్లేయర్గా అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంజయ్ను బుధవారం హన్మకొండ జిల్లా చీఫ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏ1- బండి సంజయ్ కుమార్ (51), ఏ2- బూరం ప్రశాంత్ (33), ఏ3 – గుండెబోయిన మహేశ్ (37), ఏ4- మైనర్, ఏ5- శివగణేశ్ (19), అరెస్టయిన నిందితులు కాగా.. ఇక పరారీలో ఏ6- పోగు సుభాష్ (41), ఏ7- మైనర్, ఏ8-మైనర్, ఏ9- పెరుమాండ్ల శ్రామిక్ (నాని) (20), ఏ10- పోతబోయిన వర్షిత్ (చందు)(19) నిందితులు ఉన్నారు వీరికోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Read also: Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం
Also Read
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
ఇది ఇలా ఉండగా.. సంజయ్ లాయర్ల విజ్ఞప్తి మేరకు బండిని కరీంనగర్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. పోలీసులు సంజయ్ను కరీంనగర్ జైలుకు తీసుకొచ్చి గోదావరి బ్యారక్లో ఉంచారు. జైలు అధికారులు సంజయ్కు ఖైదీ నంబర్ 7917ను కేటాయించారు. కరీంనగర్ జైలులో ఉన్న సంజయ్ను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. సంజయ్ ని కలిసేందుకు అనుమతించని జైలు అధికారులు.. బట్టలు, ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో బండి అపర్ణ కరీంనగర్ జైలు నుంచి భర్తను కలవకుండా వెనుదిరిగింది. బండి సంజయ్ కుటుంబ సభ్యులు ములకత్ కోసం ఈరోజు (గురువారం) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అనుమతి ఇస్తే భార్యాపిల్లలతో కలిసి సంజయ్ను కలిసే అవకాశాలున్నాయి. బీజేపీ నేతలు కూడా బండి సంజయ్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జైలు వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎక్కడా ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు రాకుండా జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
Annamalai: “రాహుల్ గాంధీకి స్వరా భాస్కర్ గులాబీలు ఇచ్చారు”.. సుదీప్ చేరికపై అన్నామలై..
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!