Bandi Sanjay: అన్ని కొంటాన్న మొనగాడు కేంద్రానికి లేఖ ఎందుకు రాసిండో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో సీఎ కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పంటల సాగుకు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు చేయకుండా రకరకాల హామీలు ఇస్తున్నారని ఆ తరువాత మర్చిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వరి.. వేస్తే రైతులకు ఉరి అంటాడు.. మరోసారి సన్న వడ్లు వేయాలే అంటాడు.. మరోసారి దొడ్డు వడ్లు వేయాలే అంటాడు. ఇంకోసారి యాసంగిలో వడ్లు కొనం అంటాడు.. ఇలా పరిపరి విధాలుగా ముఖ్యమంత్రి తలతిక్క మాటలు మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ఆదరణ తగ్గుతుందని భయపడి వడ్ల కొనుగోలు డ్రామాలు మొదలుపెట్టి రైతులకు వరి కోత పెట్టాలని విమర్శించారు.
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
2020-21వ సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి ఇవ్వవలసిన 9.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఇటీవలనే కేంద్రం వడ్లు కొనడం లేదు మేము కొంటామని ప్రగల్భాలు పలికాడు. మూడు రోజుల క్రితం ఈనెల 13న యాసంగిలో పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిండు అని మీడియాకు ఓ లేఖను చూపారు. అన్ని కొంటానన్న మొనగాడు ఇప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాసిండో ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..