NTV Telugu Site icon

Bandi Sanjay Padayatra: బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్‌.. ఎప్పటి నుంచి అంటే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Padayatra: బండి సంజయ్‌ ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడిందని కరీంనగర్ ఎంపీ బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇన్ చార్జి మనోహర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ సభ రేపు ఉంటుందని స్పష్టం చేశారు. కోర్టు నిబంధనలను బట్టే పాదయాత్ర సభ ఉంటుందని అన్నారు. ఆ తర్వాత నుంచి పాదయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చిందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ కనుసన్నలలోనే పాదయాత్ర సభను అడ్డుకునే కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. మా లక్ష్యం భైంసా పట్టణం కాదు.. తెలంగాణ అంతటా పాదయాత్ర అని మనోహర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Read also: Kanpur Man Threatens Minor: పెళ్లి చేసుకుంటావా.. లేదా ముక్కలుగా నరికేయాలా?

కరీంనగర్ జిల్లా బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాదయాత్ర బహిరంగ సభపై కొనసాగుతున్న వాదోపవాదాలకు స్పందించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. మరికొద్దిసేపట్లో కరీంనగర్ నుండి బైంసాకు బండి సంజయ్, బీజేపీ శ్రేణులు బయలుదేరుతున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. బైంసా సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న హైకోర్టు.. బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొంసాగించాలని షరతు పెట్టింది. కోర్టు తుదితీర్పు నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు.
Minister RK Roja : రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారు