Bandi Sanjay : పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సామాన్య ప్యాలెస్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు సాయం బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. జిల్లాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ధ్వంద్వ విధానం అవలంబిస్తుందన్నారు. కేంద్రం కాన్ఫరెన్స్ పెడితే మేము ధాన్యం కొనం అని చెప్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు 62 వేల కోట్లు బకాయి ఉందని ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్ బిల్లు పెంచే కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏటా 6200 కోట్ల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేశారని, 20 గ్రామాలకు ఉపయోగపడే విద్యుత్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఫ్రీ గా వాడుకుంటున్నారన్నారు. ఎంఐఎం దాడి చేస్తుందనే పాత బస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. కేసీఆర్ అబద్ధాల కోరు.. ఆయనది నోరు కాదు తాటి మట్ట అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అందుకే సీఎం కేసీఆర్ జిల్లాల టూర్లు చేస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!