Bandi Sanjay: రైస్ మిల్లర్లను కేసీఆర్ మోసం చేశారు
రాజ్యసభ ఎంపీగా కే. లక్ష్మణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగానే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటు కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్ష్ పాండేను కలిశారు. వారితో తాను తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ‘ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తున్నామని చెప్పిన ఆయన.. బీజేపీ డిమాండ్ తర్వాతే జూన్ నెలలో కేసీఆర్ ఉచితంగా ప్రజలకు బియ్యం అందించారన్నారు.
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చే ఉచిత బియ్యాన్ని కెసిఆర్ పంపిణీ చేయడం లేదన్నారు. అందుకే మిల్లులో బియ్యం పేరుకుపోయాయని, పేరుకుపోయిన ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెలలో ఉచిత బియ్యం పంపిణీ చేయలేదని చెప్పిన బండి సంజయ్.. రైస్ మిల్లుల్లో బియ్యం సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను తాను కోరానన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, తగిన చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. రైస్ మిల్లర్ సమస్యలకు సీఎం కేసీఆరే కారణమని, రైస్ మిల్లర్లను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ బియ్యం కొనట్లేదని, కేంద్రమే కొంటోందని వెల్లడించారు. అవసరమైతే రైస్ మిల్లర్ల అసోసియేషన్స్ను ఢిల్లీకే తీసుకొచ్చి మంత్రి పీయూష్ గోయల్ని కలిపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!