Bandi Sanjay: ప్రశ్నించే గొంతులను టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశ్నించే వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ జిల్లా పెరమాండ్ల గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడాన్ని తీవ్రంగా ఖండించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించాడన్ని వ్యతిరేఖిస్తే అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం అని.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీయడం..ఆ వీడియోను టీఆర్ఎస్ నేతలకు చూపిస్తూ రాక్షస పొందడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఐ ఫోన్ చేసి బాధితులను ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించడం.. రౌడీ షీట్ ఓపెన్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ సభ్యసమాజం తలొంచుకునేలా వ్యవహరించడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు.
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ఈ ఘాతుకానికి పాల్పడ్డ సీఐ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఐ భరత్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని..పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ పుటేజీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపిన అమాయకులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్ట, న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే పార్టీ జిల్లా నాయకులు ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి వాస్తవాలను సేకరిస్తోందని.. రేపు పార్టీ రాష్ట్ర శాఖ లీగల్ సెల్ టీం జిల్లాలో పర్యటించి వాస్తవాలను తెలుసుకుంటుందని.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం పోలీసుల ద్వారా అణచివేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతం ముక్త ఖంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ చేస్తున్న ఉద్యమంలో భాగం కావాలని బండి సంజయ్ కోరారు.
తాజావార్తలు
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!