Bandi Sanjay: వచ్చేది మా ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే బైంసా పేరు మారుస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay criticizes CM KCR: సీఎం కేసీఆర్ కు మూడింది.. వచ్చేదీ బీజేపీ సర్కారే అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత ప్రజసంగ్రామ యాత్రలో భాగంగా బైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే బైంసా పేరును ‘మహిషా’గా మారుస్తామని అన్నారు. బైంసాను దత్తత తీసుకుంటామని.. బైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం అని వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను కష్టాలు పెడుతున్న కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు.
బీజేపీ అధికారంలోకి రాగానే.. అర్హులైన అందరికీ ఉచితంగా విద్యా-వైద్యం అందించడంతో పాటు ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామని బండి సంజయ్ అన్నారు. బైంసాలో వచ్చిన ప్రజలను చూస్తే మాలో జోష్ పెరుగుతుందని ఆయన అన్నారు. బైంసాలో మతకల్లోల్లాల్లో గాయపడిన, కేసులు పాలైన బాధితులను అభినందిస్తున్నా అని.. బైంసా బాధితుల పక్షాన హిందూవాహిని పోరాటంపై ప్రశంసలు కురిపించారు. బైంసా రావాలంటే వీసా తీసుకోవాలా..? బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ఉందా..? అని ప్రశ్నించారు. ఇక్కడికి రావాలంటే వీసా తీసుకుని రావాలా.. మతవిద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నాయకులు మాత్రం ఎక్కడైనా తిరుగొచ్చా..? అని ప్రశ్నించారు. హిందూ దేవతలను కించపరిచే మునావర్ ఫరూఖీ వంటి వారు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చా..? అని అడిగారు.
Also Read
Read Also: Etela Rajender: సీఎం కేసీఆర్ డైరెక్షన్లో పోలీసులు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగిన కాషాయ జెండా రెపరెపలాడించాలని.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బైంసాను దత్తత తీసుకుంటామని అన్నారు. బైంసా ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. హిందూ సమాజం మీ వెంట ఉంటుందని ఆయన అన్నారు. బైంసా అంటే కేసీఆర్ కు భయమని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడని.. రూ. 5 లక్షల కోట్లు అప్పుచేసి, ఒక్కో వ్యక్తిపై రూ. 1.5 లక్షల అప్పు మోపిండని అన్నారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని.. నరేంద్రమోదీ ప్రభుత్వ పోయిన నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈ నెల 70 వేల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నా చేస్తే పట్టించుకోలేదని.. ఇచ్చిన హామీలు గాలికొదిలేశాడని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కడెం ప్రాజెక్టు గేట్ల మెయింటనెన్స్ కు నిధులు ఇవ్వలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని అన్నారు. అన్ని పార్టీకు అధికారం ఇచ్చారు..ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను బండి సంజయ్ కోరారు. బైంసా గడ్డపై 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంకో ఏడాది హిందువులపై దాడులు చేయిస్తాడు.. కష్టాను భరిద్ధాం.. రాబోయేది మన ప్రభుత్వమే అని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?