Bandi Sanjay: ఆనాడు ఎన్టీఆర్పై చెప్పులు విసిరిన వారిలో కేసీఆర్ లేరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కేవలం బీజేపీని తిట్టడానికే ఆయన టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే కేసీఆర్ బీజేపీని తిట్టడానికి ఈ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. సాధారణంగా ప్లీనరీలో పార్టీ వ్యవహారాలు, సంస్థాగత ఏర్పాట్లపై చర్చిస్తారని.. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ దీనికి విరుద్ధంగా జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. 33 రకాల కూరలు వండుకుని తినడానికే ఈ సమావేశాన్ని వాడుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో తాము చెప్పగలమని.. కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పలేకే ప్లీనరీలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
2014లో మోదీ ప్రధానిగా అధికారాన్ని చేపట్టే సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండేదని.. ఈ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలను కేంద్రం చేపట్టిందని బండి సంజయ్ వివరించారు. విదేశీ నేతలు కూడా పలు సందర్భాల్లో మోదీ పనితీరును మెచ్చుకున్నారని.. కానీ కేసీఆర్కు మాత్రం మోదీ చేసిన పనులు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్.. అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవన్నారు. రూ.70వేల కోట్లు డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడిందన్నారు. అందుకే విద్యుత్ ఛార్జీలను ఇటీవల ప్రభుత్వం పెంచిన సంగతిని బండి సంజయ్ గుర్తుచేశారు.
Also Read
- Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
మరోవైపు రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు అంచనాలు పెంచి దోచుకోలేదా అని సీఎం కేసీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం ఆస్తులు గణనీయంగా పెరిగాయి కానీ ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆస్తులను ప్రకటించిన కేసీఆర్ ఆయన కుటుంబం ఆస్తులను ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఎన్టీఆర్ తన అభిమాన నాయకుడు అని పొగిడిన కేసీఆర్.. ఆనాడు వైశ్రాయ్ హోటల్లో ఎన్టీఆర్పై చెప్పులు విసిరిన ఆయన లేరా అంటూ బండి సంజయ్ సూటి ప్రశ్న వేశారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేస్తుంటే ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అభినందన తీర్మానం ఎలా పెట్టుకుంటారన్నారు. ప్రశాంత్ కిషోర్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ కాదని.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!