Gymkhana Stadium: అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆఫీసుకు రండి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gymkhana Stadium: జింఖానా మైదానంలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. HCA ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టికెట్ల విక్రయాలపై పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు HCAకు నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.
జింఖానా గ్రౌండ్ లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని HCAపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. 30 వేల మందికి పైగా అభిమానులు వస్తే కేవలం 4 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. సరైన నిర్వహణా ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు ఎంతమంది వస్తారనేది స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జింఖానా మైదానంలో క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాటలో గాయపడి, స్పృహ కోల్పోయిన ఓ మహిళ ప్రాణాలు రక్షించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఓ లేడీ కానిస్టేబుల్ నోటి ద్వారా ఆమెకు శ్వాస అందిస్తూ బతికించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ కూడా చేశారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
Read also: Sajjala Ramakrishna Reddy: ఎన్టీఆర్ అంటే మాకు ఎనలేని గౌరవం
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటకు HCA నిర్వహణా వైఫల్యం కారణమని విమర్శలు వస్తున్నాయి. టికెట్లు ఇచ్చే జింఖానా గ్రౌండ్ లో 4 కౌంటర్లు ఉండగా మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో గ్రౌండ్ గేట్లు తెరవగానే పురుషులతో పాటు మహిళలూ లోపలికి పరిగెత్తి ఒకే లైన్లో నిలబడగా తోపులాట జరిగింది. INDvSAUS మూడవ టీ20 మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతుందని ముందే ప్రకటించినా.. టికెట్ల జారీలో ఎందుకీ గందరగోళం. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూశారు. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్దే నిరీక్షించినా.. టికెట్లు దేవుడెరుగు.. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూడాల్సి వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ప్రతిఫలం ఇదేనా అంటూ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం జింఖానా గ్రౌండ్లో టికెట్ల అమ్మకంలో తొక్కిసలాట జరగడంతో టికెట్ల కౌంటర్లను HCA తాత్కాలికంగా మూసేసింది. పరిస్థితి సద్దుమణిగాక తిరిగి విక్రయం ప్రారంభిస్తారని తెలుస్తోంది. 30 వేల మందికి పైగా అభిమానులు రాగా కేవలం 4 కౌంటర్లే ఏర్పాటు చేశారు. గేట్లు తెరవగానే ఒక్కసారిగా అంతా లోపలికి దూసుకురావడంతో తొక్కిసలాట, లాఠీఛార్జ్ జరిగి పదుల సంఖ్యలో గాయపడ్డారు. చాలా మందికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. ఎవరూ చనిపోలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!