Sajjala Ramakrishna Reddy: ఎన్టీఆర్ అంటే మాకు ఎనలేని గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక పై ఈసీ నోటీసుపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పార్టీ ప్లీనరీలో జగన్ను శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకోవాలని ప్రతిపాదించిన మాట వాస్తవం అన్నారు. అది నాయకుల, కార్యకర్తల ఆకాంక్ష. అయితే శాశ్వత అధ్యక్షుడు అనే ప్రతిపాదనను జగన్ తిరస్కరించారు. ఈసీ ఈ విషయం పై స్పష్టత అడిగింది. జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న అంశం ప్లీనరీ మినిట్స్లో లేదన్నారు సజ్జల. ఐదేళ్ల కొకసారి అధ్యక్ష ఎన్నిక జరగాలని గత ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకున్నాం. ఇదే విషయాన్ని ఈసీకి వెల్లడించాం. కానీ ప్లీనరీ సమయంలో ప్రతిపాదన అంశం వార్తల్లోకి రావటంతో ఈసీ స్పష్టత అడిగింది. మా అధ్యక్షుడి ఎన్నిక ఐదేళ్ళకు ఒకసారి నిర్వహిస్తాం అనే అంశాన్ని సీఈసీకి స్పష్టం చేయనున్నాం.
Read Also: Bhuvaneshwar Kumar: భువిపై విమర్శలు.. మద్దతుగా ఆసీస్ మాజీ ప్లేయర్
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
మరోవైపు ఎన్టీఆర్ పట్ల సీఎం జగన్ అత్యంత గౌరవం ఇచ్చారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పేరు పెట్టీ సీఎం జగన్ గౌరవించారు. ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ సభలో చెప్పారు..ఎన్టీఆర్ పేరు చరిత్రలో తెర మరుగు కావాలని కోరుకునే మొదటి వ్యక్తి చంద్రబాబు..ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెడితే చంద్రబాబు కుమిలిపోయి ఉంటాడు..ఇప్పుడు యూనివర్సిటీకి పేరు మార్చడంతో చంద్రబాబు లోలోపల సంతోష పడుతూనే ఉంటాడు.. ఎన్టీఆర్ పేరు వింటే చంద్రబాబుకు వెన్నుపోటు గుర్తుకు వస్తుంది.. ఎన్టీఆర్ విధానాన్ని చంద్రబాబు ఎక్కడైనా నడిపారా..? టీడీపీ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు ఎందుకు తొలగించారు?
వైఎస్సార్, ఎన్టీఆర్ చిరస్మరణీయంగా నిలిచే నాయకులు..రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరును చంద్రబాబు ఎందుకు పేరు మార్చారు..? అప్పుడు ఈ బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఎందుకు నోరు విప్పలేదు?? ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటాడు. అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నాడని మండిపడ్డారు సజ్జల.
చంద్రబాబు ఎన్టీఆర్ ను మానసికంగా క్షోభ పెట్టారు.అందుకే ప్రాయశ్చిత్తంగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఆరోగ్యశ్రీ వైయస్సార్ బ్రెయిన్ ఛైల్డ్. ఆయన పేరు మార్చినప్పుడు మనసుకు తెలియదా??యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయం. కింగ్ జార్జ్ హాస్పిటల్ గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. మెడికల్ విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో వైఎస్సార్ వేసిన ప్రభావం విప్లవాత్మకమైందన్నారు సజ్జల.
Read Also: CM Jagan Speech LIVE: ఎన్టీఆర్ని మించిన నటుడు దేశంలో ఎక్కడా ఉండడు
తాజావార్తలు
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..