Tandur: విద్యార్థినీల ఆరోగ్య సంరక్షణపై ఎందుకింత నిర్లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాండూరులో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై గిరిజన బాలికల వసతి గృహ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తన కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందికరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థిని తండ్రి రాములు నాయక్ ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ నగర పరిధిలోని వెంకటాపురం తండకు చెందిన రాములు నాయక్ తన ఇద్దరు కూతుర్లు అమృత, లోకేశ్వరిలను గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో చదివిస్తున్నాడు. అయితే గత నెల 26వ తేదీన అమృత అనారోగ్యానికి గురైంది. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతోందని తండ్రికి హాస్టల్ సిబ్బంది సమాచారం అందించారు. ఇక, విషయం తెలుసుకున్న రాములయ్య వెళ్లడంతో అప్పటికే బాలిక స్పృహ కోల్పోయి ఉండడంతో.. వికారాబాద్ లోని మహావీర్ హాస్పిటల్ కు చికిత్సకై తరలించారు. ఈ క్రమంలో విద్యార్థిని అమృత చికిత్స పొందుతోంది.
Read Also: Intresting Traditions: గోమూత్రంతో తలస్నానం, పేడతో పండ్లు తోమడం.. ఇలా ఎన్నో.. ఎక్కడో తెలుసా..?
Also Read
ఈ విషయమై విద్యార్థిని తండ్రి రాములు నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థినీల ఆరోగ్య సంరక్షణ పట్ల వసతి గృహ సిబ్బంది, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అప్పు చేసి 70 వేల రూపాయల వరకు ఖర్చు చేసి చికిత్స అందించాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము మరింత ఆలస్యం చేస్తే తమ కూతురు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల నిర్వహణ బృందంతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన బిడ్డ ఒక అమ్మాయి గురించే కాకుండా వసతి గృహంలోని మరి కొంత మంది సైతం ఇబ్బందులు పడుతున్నారని వారి తమ ఆవేదనను బహిర్గతం చేయలేకపోతున్న పరిస్థితి నెలకొందని రాములు నాయక్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!