Worse in Warangal: అమ్మకానికి కన్న కొడుకు.. వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worse in Warangal: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నా కొడుకును తండ్రి అమ్మాకానికి పెట్టిన తీరు యావత్ ప్రపంచానికే దిగ్భాంతి కలిగేలా చేసింది. ఆర్థిక ఇబ్బందులో లేక ఎందుకు తనకు భారం అనుకున్నాడో తెలియదు కానీ.. కన్నకొడుకును తల్లికి తెలియకుండా అమ్మేశాడు తండ్రి. కన్న తండ్రి వేలు పట్టుకుని బయటకు వెళదామంటే సరే అని తల ఊపుతూ తనతో వెళ్లిన కొడుకును రెండు లక్షల 50 వేలకు అమ్మడంతో తండ్రి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కొడుకు. ఎవరితో వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తుండిపోయాడు. వేలు పట్టుకుని వచ్చిన నాన్నతో వెళ్లడానికి సిద్దమైన కొడుకును వేరే వారికి అప్పగించి వెళుతున్న నాన్నను “నాన్న” అంటూ పిలిచిన ఆ కసాయి తండ్రి వెనుతిరిగి కూడా చూడలేదు. చివరకు ఏడుస్తూ వారి భుజాలమీదే తలను పెట్టుకుని కంట నీరు వస్తున్నా ఏం చెప్పాలో అర్థం కానీ ఆ పసి హృదయాన్ని అర్థం చేసుకునేవారు కరవయ్యారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లి వెతకడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. తండ్రే కన్న కొడుకును తీసుకుని వెళ్ళాడని అనుమానం వచ్చి ప్రశ్నించడంతో భర్త గుర్తు రట్టైంది.
Read also: Namibia Study Tour: చిరుతలు ఎందుకు చనిపోతున్నాయి?.. అధ్యయనం కోసం నమీబియా స్టడీ టూర్
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
వరంగల్ జిల్లా మసూద్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే మసూద్ పెద్దకొడుకు అయాన్ ను అమ్మేందుకు ప్లాన్ వేశాడు. హైదరాబాద్ చెందిన ఓ కుటుంబానికి రెండు లక్షల 50 వేలకు అమ్మేందుకు బేరసారాలు చేశాడు. ఈ వ్యవహారం నడిపేందుకు శఖరాసికుంటకు చెందిన ఓ మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. చివరకు రెండున్నర లక్షలు ఇచ్చేందుకు ఇప్పుకుంది. అయితే.. నాలుగు రోజులుగా 4 ఏళ్ల తన పెద్ద కొడుకు అయాన్ కనిపించకపోవడంతో తండ్రిని ప్రశ్నించింది. ముందు తన సోదరి దగ్గర ఉంచినట్లు మసూద్ బుకాయించాడు. దీంతో మసూద్ మాటల పైన అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. బాలుడిని రెండు లక్షల 50 వేలకు అమ్మినట్లు తండ్రి చెప్పడంతో భార్య, కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కన్న బిడ్డను ఎలా అమ్మావు అంటూ ఛీదరించుకున్నారు. అయినా మసూద్ లో మనస్తాపం ఎక్కడా కనిపించలేదు. ఇక కొడుకును ఇంటికి తెచ్చుకుంటూ అంటూ భార్య చెప్పినా మసూద్ వినలేదు. నాకు తెలియదు వారు ఎక్కడకు తీసుకెళ్లారో అంటూ మాట దాటేశాడు. ఇక బాలుడి మేన మామ మసూద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
MS Dhoni: దటీజ్ ధోనీ.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరప్ప.. మెరుపు కంటే వేగం..!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!